పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

100

శ్రీనివాసవిలాససేవధి


గా వేంకటేశ్వరుఁ గాంచి ప్రార్థించి
స్వామిపుష్కరిణిని స్నానంబుచేసి
స్వామిచే వరమంది చను మని పలికె.
అపుడు శ్రీరాముఁ డాయంజనాదేవిఁ
గృపను వీక్షించి యాకెలను నిల్చున్న550.
హనుమంతుఁగనుఁగొన్న నతఁడు కేల్మొడిచి
వినయంబుతో నట్ల విన్నవించుటయు
మోమున చిఱునవ్వు మొలకలెత్తంగ
రాముఁ డ ట్లగునంచు రయమునఁ దరలి
వనచరసైన్య ముర్వడి నడువంగ
వనములు గిరులు గహ్వరములు నదర
ధరణి వడంక దిక్తటములు బెదర
నెరసి భానుని గప్పి నెగడ రజంబు
దండిగా సింహనాదము సేయువారు
కొండలపై నెక్కి కుప్పించువారు560
పెంపొందువృక్షముల్ పెకలించువారు
సొంపున తేనియల్ జుత్తెడువారు
బిగువుతో నొండొరుల్ పెనఁగెడువారు
మిగుల రాఘవుకూర్మి మెచ్చువారలును
విడివడి విహరించ వెంకటాచలము
వడి నెక్కి మక్కువ వనజకల్హార
వారహారిణియైన స్వామిపుష్కరిణి
తీరంబున వరాహదేవు సన్నిధికి
వచ్చుచో నుగ్రుఁడై వారిజమిత్రుఁ
డుచ్చస్థితిభజించి యుర్వి కత్యంత570.