పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము.

99


వాయించకయె మ్రోయు వాద్యబృందములు
పాయక విహరించు పద్మాకరములు
బహుళకాంచనమణిప్రభల నిన్నియును
రహి మించి కోటిసూర్యప్రకాశమున
గంథర్వనగరధిక్కారియై మీఱి
బంధురశ్రీలచే భాసిల్లు పురము
శ్రీభూమినీళలు సేవింప శౌరి
ప్రాభవంబున నందు బరగుచు నిత్య 530
సూరులు ముక్తులున్ శుద్ధసత్వంబు
మరి కొల్వఁగ లీల మెఱయుచునుండు
నజశంకరేంద్రులు నమరగంధర్వ
భుజగకిన్నరనరపుంగవుల్ మొదలు
నెవరును గననేర రీశ్వరు మాయ
దవిలియుండుటఁజేసి తత్ప్రభావంబు
పొగడంగ వశమె మాబోంట్లకు నెల్ల
భగవంతుఁడే దాని భావింపనోపు
మును రాముఁ డాదశముఖుని ఖండింప
వనచరసేనతో వచ్చుచుండంగ 540
నంజనాదేవి యాహనుమంతుఁ జూడ

అంజనాదేవి రామునికి హితవుచెప్పుట.

రంజిల్లు చటు చేరి రఘువీరుఁ గాంచి
ప్రణమిల్లి దేవ ! యారావణాసురుని
రణమునఁ గెల్వ దుర్ఘట మెవ్వరికిని
దేవర నల వై రిఁ దెగటార్చి గెలువ