పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

అబ్బునే మాకు నీకోరి కనినఁ బడుచు, లార ప్రాయంపుమదమున మీరు నాకు
మ్రొక్క నైతిరి యీదోస మొక్కజాడ, వెఱచిపాఱెడు మురహరస్మరణమునను.

29


క.

ఇప్పుడు మీకుం జెప్పెద, నప్పురుషోత్తముఁడు వరదుఁడై మిము నొకరిం
దప్పక వివాహ మగుటకుఁ, జొప్పడినమహావ్రతంబు సులభము గాఁగన్.

30


వ.

సకలసుమనోవికాసమయంబును మదనవిదళితమానినీసమయంబు నైనవసంతసమయం
బున విరహిజనవిపక్షం బైన శుక్లపక్షంబున ద్వాదశీదివసంబున నుపవసించి మరంద
బిందునిష్యందశీతలం బైనపుష్పమంటపతలంబునఁ బరిస్తృతవిచిత్రవస్త్రాకల్పం బైన
తల్పంబున వెండిం జేసినపుండరీకాక్షు లక్ష్మీయుతంబుగా నిలిపి షోడశోపచారంబు
లు సలిపి మనోభవాయ నమో యని శిరంబును ననంతాయ నమో యని కటీరంబును
గామాయ నమో యని బాహుమూలంబులుం గుసుమస్త్రాయ నమో యని యుద
రంబును మన్మథాయ నమో యని పాదంబులు హరయే నమో యని సర్వావయ
వంబులుం బూజించి పిదప నిక్షుదండంబులు నాలు గద్దేవునినలుదిక్కులం బెట్టి
ప్రదక్షిణపూర్వకంబుగా మ్రొక్కి హృద్యంబు లైననృత్తగీతవాద్యంబుల జాగర
ణంబు చేసి మఱునాఁడు సూర్యోదయావసరంబున నధీతవేదవేదాంగుండును సం
పూర్ణసకలాంగుండును విష్ణుభక్తిభాసురుండును నైనభూసురునకుం దత్ప్రతిమ
దానం బిచ్చి భోజనడక్షిణాదికంబుల బ్రాహ్మణులం దృప్తులం జేసినం గేశవుండు
మీకు నధినాయకుం డగు నిది యిట్లుండె మీరు నాకు నుద్దండంబున దండంబు
వెట్టనికతంబునఁ గొండొకకాలంబున నేతత్సరోవరతీరంబునం దపంబు సలుపు
నతివిశిష్టు నష్టావక్రమహామునిం బరిహసించి తచ్చాపంబున గోపాలబాలికలై భూ
లోకంబున మదనగోపాలునికిం గళత్రంబులు గాఁగల రని హరిభక్తివిశారదుండు
నారదుం డానతిచ్చి చనియె నయ్యచ్చర లట్ల కావించి కృతార్థలయి రిది యనంత
ద్వాదశీవ్రతంబు.

31


సీ.

భద్రాశ్వభూప శుభవ్రతం బే నీకుఁ జెప్పెద విను మార్గశీర్షశుక్ల
పక్షంబునం బ్రతిపత్తిథి మొదలు దశమిదాఁక నేకభుక్తమును జరపి
నాఁటిమధ్యాహ్నంబునం గేశవుని భక్తిఁ బూజించి తా నొక్కప్రొద్దు చేసి
ధరణివ్రతంబుచందమున సంకల్పోపవాసంబు లొనరించి ద్వాదశిదిన
మునను గేశవనామమునను సువర్ణ, సహితతిలపాత్రదానంబు సలుపవలయుఁ
గృష్ణపక్షంబుదినముల నిట్లు నడపి, దాన మీఁ దగుఁ గృష్ణాభిధానమునను.

32


మ.

అవనీనాయక యిట్టు లాశ్వయుజమాసాంతంబుగా నేకభు
క్తవిధుల్ సల్పుచుఁ జైత్రమాసము మొదల్గా నాల్గుమాసాలు స