పుట:రుక్మిణీపరిణయము (కూచిమంచి తిమ్మన).pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఘనగజయానముల్ భ్రమరకంబులు సత్కలకంఠనాదముల్
దనరఁ జెలంగుసానులవిలాసము చూచె బుధేంద్రుఁ డుబ్బుచున్.

24


తే.

వీనులకుఁ బండు వయ్యె నహీనమై న, వీనమధుపానపీనకులీనసూన
లీనసదలీనసంతానతానమాన, మానగంబున ధరణీసురాన్వయునకు.

25


తే.

నాగకదలీకదంబపున్నాగశల్య, రోహితర్క్షశివాదులఁ బ్రోచి మఱియు
నాగకదలీకదంబపున్నాగశల్య, రోహితర్క్షశివాదులఁ బ్రోచు నద్రి.

26


ఉ.

భిల్లసరోజలోచనలు పింఛపటంబులు గట్టి గట్టుపైఁ
బెల్లుగఁ గ్రీడసేయ శశిబింబనిభాస్యలచన్గవల్ విరా
జిల్లెడునిమ్మపం డ్లనుచుఁ జేరి కనెం బ్రభుదర్శనార్థమై
యుల్లమునందు నమ్మహిసురోత్తముఁ డుబ్బి హరింపఁగోరుచున్.

27


సీ.

నీలకంఠాకృతి నెఱిఁ బూని యానందతాండవం బాడుశిఖండితతులు
రామనామం బజస్రముఁ బఠించుచును సత్ఫలవాంఛ నలరెడుచిలుకగములు
సరసాగమస్థితు లరయుచుఁ గృష్ణలీలలఁ గేరుచుండుకోకిలకులములు
సుమనోభిరూఢిచేఁ జొక్కి మన్మథగురుసేవ సేయుమధువ్రతావలులును


తే.

బరమహంసస్వరూపంబు సరవిఁ దాల్చి, బ్రహ్మపదబుద్ధిఁ జెలఁగుమరాళములును
గల్గియుండెడుచో వేఱె తెలుపనేల, యన్నగంబు మునిశ్రేణి కాకరంబు.

28


తే.

సదమలాహీనకటకుఁడు చంద్రధరుఁడు, నీలకంఠోల్లసితుఁడు మానితవృషాంకుఁ
డఖిలసుమనోవినుతపాదుఁ డగునతండు, విశ్రుతముగ గిరీశుఁడై వెలయు టరుదె.

29


ఉ.

ఆవసుధాధరంబున విహారము చేయుచుఁ జూచె నొక్కచో
భూవిబుధాగ్రగణ్యుఁడు విభూషితశేషభుజంగమున్ జగ
త్పావనకారణాంగము నపారకృపారచితాంతరంగమున్
దైవభుజంగముం గపటదైత్యవిభంగము శంభులింగమున్.

30


ఉ.

కాంచి తదీయమూర్తిఁ గుతుకంబున డెందమునందు నిల్పి య
క్కాంచనగర్భవంశమణికాంచనకుందకురంటకాదికా
భ్యంచితసూనబిల్వదళపక్వఫలాగులచేతఁ బూజ గా
వించి దృఢానురాగమున వేడఁదొడంగె ననేకభంగులన్.

31


చ.

జయజయ పార్వతీశ శివశంకర భూరిసమిద్భయంకరా
జయజయ నీలకంఠపురశాసనవంచితనీరజాసనా
జయజయ దేవదేవ హరిసాయక నిత్యశుభప్రదాయకా
జయజయ లోకనాథ సురచారణయక్షమునీంద్రకారణా.

32


దండకము.

శ్రీమద్గిరీశాయ ధీమత్ప్రకాశాయ, కాశాబ్దభేశాశంగాశ్వాధిపాకాశగంగా
సరిల్లోలకల్లోలమల్లీశరన్నీరదాళీమరాళీసుధాపూరకర్పూరపాటీరడిండీర