పుట:భాస్కరరామాయణము.pdf/383

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కత్రాణపరాయణ విను, శత్రులు భీతిల్ల నలుక సమకొల్పు మదిన్.

10


క.

చిచ్చు చొరుఁ డన్న నురవడిఁ, జొచ్చెద మమరారిపురము సొచ్చెద మరులం
దెచ్చెదము దీనదశ కిటఁ, దెచ్చెద మవలీల దేవ దేవరదేవిన్.

11


క.

ఓలిం దోఁచుచు నున్నవి, మేలుగ నెల్లెడల బహునిమిత్తంబులు భూ
పాల జయ మవశ్యము నీ, పాలిద నిక్కంబు లంకపై విడియు మిఁకన్.

12


వ.

అనిన విని నరేశ్వరుం డవ్వానరేశ్వరువాక్యంబుల కలరుచుఁ బవనతనయు
నుపలక్షించి.

13


ఆ.

వరము వడసి యైన శరము ప్రయోగించి, వట్టఁ జేసి యైనఁ గట్టి యైన
వనధి దాఁట నెట్లు వచ్చుఁబో దుర్గంబు, తెఱఁగు చెప్పు నాకుఁ దెలియ ననుడు.

14


శా.

ప్రాకారంబు లగడ్త లట్టడులు యంత్రవ్రాతముల్ వప్రముల్
వాకి ళ్లాయుధసంపదల్ గజము లశ్వంబుల్ రథంబుల్ భటా
నీకంబుల్ బహుకేతనాదులు మదిన్ నిర్మించినట్లుండు భూ
నాకం బప్పుర మేకొఱంతయును గానంబట్ట దెప్పట్టునన్.

15


ఉ.

ఎక్కడఁ జూచినం బుడమి యీనెనొకో యన వేలు లక్షలుం
బెక్కులు కోటులుం గలిగి భీకరభంగులఁ గ్రొవ్వు లారఁగా
నుక్కునఁ దీరిన ట్లమరు నుగ్రపుమేనులయాతుధాను లొ
క్కొక్కని మెచ్చనట్టిభటు లుండుదు రొక్కొకవానివాకిటన్.

16


వ.

మఱియు నన్నగరంబు పడమటివాకిటఁ గరాళశూలహస్తు లైన పౌలస్త్యులు పది
వేవురును దక్షిణోత్తరద్వారంబులఁ జతురంగబలసమేతు లై యొక్కొక్కలక్ష
యుం దూర్పుగవనిఁ జర్మకృపాణపాణులు పదిలక్షలును మధ్యమస్కంధంబున
సింధురబంధురం బగుసైన్యంబుతో ననేకసహస్రంబులు నుండుదు ర ట్లున్న నేమి
మనయంగదమైందద్వివిదపనసనలనీలజాంబవంతులు కడంకం గడంగి లంకఁ ద్రికూ
టాచలంబుతోన పెఱికి పేటాడం జాలుదురు దేవరసామర్థ్యంబు దలంప నది
యేమిదుర్గమంబు తగినముహూర్తంబునఁ బ్రయాణంబు సేయుదు గాక యని
హనుమంతుండు విన్నవించిన నన్నరేంద్రుం డినతనయుం గనుంగొని.

17


తే.

నేఁడు రెండవఫల్గుని నిండురిక్క, గగనమణి నభోమధ్యంబు గదిసినాఁడు
నామనంబును నలరెడు నీముహూర్త, మొప్పు నిప్పుడు కదలిన నొడుతు రిపుల.

18


క.

నలులక్షకపులతో ని, బ్బలములకును దెరువు పెట్టఁ బనువుము నానా
ఫలమూలమధూదకములు, గలకందువ లరసి గమనకౌతుక మొప్పన్.

19

రాముఁడు వానరబలంబుతోడ లంకకుఁ బ్రయాణ మగుట

వ.

మఱియుం దగువారి వలయునెడల నడవ సేనానాయకుల నియోగింపు మనిన
నట్ల చేసి యతండు ప్రార్థించినం బార్థివనందనులు పవననందనవాలినందనుల
నెక్కి యైరావణసార్వభౌమాధిరోహణంబులు సేసిన త్రిదశేంద్రకిన్నరేంద్రులతె