పుట:భాస్కరరామాయణము.pdf/373

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గృహంబులు ............నాభీలార్చులు పేర్చిన నచ్చట గతాసు లైనవా
రును నతిస్ఫీతపే..........లు పట్ట దిగఁ దాఁచి దిగంబరు లగుచుఁ బాఱువా
రును విస్ఫులింగ.........శ్రుకేశంబులు పట్ట వెతకుడిచి దులుపుకొనువారును
శాలలు వెలువడి ........ బఱచి నలుగడల ననలశిఖలు పొదువఁ దిరుగుడువడి
పుడమిం బడుతు.........దొమడంబులుఁ గొమ్ములుఁ దోఁకలు గురుసులు దా
కఁ గాలి శైలా...............లిన శుండాలంబులును బక్షంబులు కమలిన సుడివ
డుచు ముడింగి............సపారావతంబులును నఁగారంబు లైనతేరులును
బెనుమంట మ.............డినయట్టాలకచిత్రయంత్రవాతంబులును దునిసి
పడిన కైదువుల్ ........... లెగయ మండెడు ధాన్యరాసులును జూర్ణంబు
లైనవజ్రవైదు...............క్తికపద్మరాగాదినానారత్నంబులును జిటిలిపడి
పొడిపొడి యై .............రసౌధహర్మ్యాదులును బెనుముద్దలుగాఁ గరగి
కూలినరజతకాంచనమయప్రాకారతోరణంబులును భస్మంబు లైనధ్వజాతపత్రం
బులును గలయఁ గాలినబొక్కసంబులును గారాకులు దరికొని మండి ఛట
చ్ఛటధ్వనుల మొదలంటఁ గాలి చాఁపకట్టుగాఁ బడినయుద్యానవనంబులును నై
సర్వవస్తుశూన్యంబును గరళజ్వాలాజాలావృతంబును నుద్ధూతభీమధూమస్తో
మాలక్షితాంతరాళంబు నగుచు నశోభితం బై లంకాపురం బుండ నప్పు డుగ్ర
కీలల మేనులు గాలఁ గనలి క్రూరాకారులు నుద్దీపితప్రతాపులు నగురక్షోవీరు
లు కోపాటోపంబునం జేరి.

488


తే.

[1]ప్రాసశూలపరిశ్వధపట్టిసాసి, ముసలముద్గరపాణు లై మునుఁగ ముసరి
రభసమునఁ దన్ను నొంపంగఁ బ్రబలశక్తి, వారినందఱ వధియించె వాయుసుతుఁడు.

489


వ.

ఇట్లు వనభంగంబును లంకాదహనంబు నొనర్చి తొడరిన రాక్షసానీకంబునం
బరిమార్చి తన్ను గోపురశిఖరతోరణహర్మ్యగవాక్షంబుల నిలిచి రక్షోవీరు
లాశ్చర్యభయంబులతోడం జూడ దేవగంధర్వసిద్ధవిద్యాధరకిన్నరకింపురుషముని
గణంబులును సర్వభూతంబులును బరమసంప్రీతు లై ప్రశంసింపం జని సముద్రం
బునం దనవాలానలం బార్చుచుండె నంత నిక్కడ సీతం గదిసి వీనుల కింపు
సంపాదింప సరమ యి ట్లనియె.

490


చ.

జనకజ నీవు తద్దయు విషాదము నొందుచు వాయుపుత్రుకై
మనమున నేల చింతిలెదు మారుతపుత్రుఁడు కట్టు లెల్లఁ దు
త్తునియలు గాఁగఁ ద్రెంచికొని దుష్టనిశాచరకోటిఁ గ్రొ వ్వఱం
దునిమి సమస్తదిక్కులను దోర్బలసంపదఁ బేర్చి వెండియున్.

491


క.

ఆభీలవాలకీలల, భూభృచ్చరపుంగవుండు పొరిఁబొరి నీలం
కాభవనము లన్నియు భ, స్మీభూతమ్ములుగఁ జేసి చేవ యెలర్పన్.

492
  1. ప్రాసశూలాయుధాయసపట్టిసాసి