పుట:భాస్కరరామాయణము.pdf/371

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వెలయ భాగ్యవిశేషముల్ గలుగునేని, నీవు నాపయి సత్కృపాన్వితుఁడ వేని
పరఁగ నగ్నిదేవుఁడ రామభక్తుఁడై న, మారుతాత్మజునకు శైత్యకారి వగుము.

464


క.

అని జనకజ యనలప్రా, ర్థన చేయఁగ నంతటం బ్రదక్షిణశిఖ లే
పున నెగయఁ బ్రజ్వలించుచు, ననలుఁడు హనుమంతునకు హిమాంశుండయ్యెన్,

465


క.

[1]ఆయెడ వాలాగ్రంబున, నాయతగతి మండుచున్న యయ్యనలము ప్రా
లేయముగతి నతిశీతల, మై యుండుట కరుదు నొంది యనిలజుఁ డాత్మన్.

466


క.

రామునిసామర్థ్యముననొ, భూమిజకారుణ్యముననొ పొందుగఁ బవనో
ద్దామసహాయంబుననో, నామేను దహింప వీయనలతీవ్రశిఖల్.

467


వ.

అనుచు సంతోషించి మహోత్సాహంబున.

468


చ.

బలువుగ రక్కసుల్ దిగిచి పట్టిన పాశము లెల్లఁ ద్రించికొం
చలఘురయంబుతో నెగసి యార్చుచు గోపుర మెక్కి యచ్చటన్
బలువిడి సూక్షగాత్రుఁ డయి బంధము లన్నియు నూడ్చి యున్నతా
చలనిభదేహ మెప్పటి విశాలముగా ధరియించి యేపునన్.

469


క.

మును తోరణమునఁ బెట్టిన, ఘనతరపరిఘంబు లీలఁ
గొని తనుఁ బట్టినదనుజుల, మునుకొని వడి నేలఁ గూల మోఁది వధించెన్.

470


వాలి యిటు విక్రమించి వి, శాలారుణవదనవారిజం బలరఁగ లాం
గూలాభీలజ్వాలా, మాలి యగుచు మెఱసె నంశుమాలియుఁబోలెన్.

471


వ.

ఇట్లు మెఱసి

472


క.

నావాలంబున వెలిఁగెడు, పావకునకుఁ దృప్తి గాఁగఁ బైపైఁ గ్రవ్యా
దావాసము లాహుతులుగఁ, గావించెద నింక ననుచుఁ గపిపతి కిన్కన్.

473

హనుమంతుఁడు లంకఁ గాల్చుట

ఉ.

మింటఁ జటచ్ఛటధ్వనులు మేఘఘనధ్వను లై చెలంగ నిం
టింటికి దాఁటి వాలమున నేచినచిచ్చు దగిల్చి దిక్కు ల
న్నింటను విస్ఫులింగములు నిండఁగఁ జల్లుచు మంట లాకసం
బంటఁగ నుబ్బి యుగ్రత సమస్తగృహంబులు గాల్చుచున్నెడన్.

474


చ.

అవె యివె పెన్బొగల్ నెగసె నక్కడ మండఁ దొడంగె నల్లచో
నవె ఘనవిస్ఫులింగతతు లాకస మంటెడుఁ బేర్చు నర్చు ల
ల్లవె హయశాలలన్ రథగజాయుధశాలల ధాన్యశాలలన్
ద్రవిణతనుత్రశాలలను రావణుపట్టపుసర్వశాలలన్.

475


వ.

అనుచుం గళవళంబునఁ బౌరు లిట్టట్టును బఱవం జొచ్చి రట్టియెడ.

476


మ.

అమరేంద్రాయుధసన్నిభంబు లయి ఫుల్లాశోకకాలాయసా
భము లై కింశుకలోహితప్రకరరౌవ్యస్ఫూర్తు లై హేమవి

  1. ఆయెడను మహోగ్రంబుగ, నాయతశిఖ లడరుచున్న యయ్యగ్నియుఁ బ్రాలేయ