పుట:భాస్కరరామాయణము.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యిరువురు నిల్చినన్ హరిహరేంద్రులు నడ్డము గారు వారికిన్.

205


క.

సుగ్రీవుఁడు రామునకు న, తగ్రీవుం డగుట నీకుఁ దలఁకం డింకన్
విగ్రహ మాగ్రహమునఁ గొన, కుగ్రాంశుతనూజుతోడ నురుతరబుద్ధిన్.

206


మ.

పరఁగన్ భానుజు యౌవరాజ్యమునకుం బట్టంబు వే కట్టు మా
దరణీయుం డగునీసహోదరుని నందం బొంద మన్నింపు సు
స్థిరవైరం బనుజన్ముతోఁ దగదు శాంతిం బొందు రామక్షితీ
శ్వరుప్రా పొందిన భానునందను ననిన్ సాధింప రా దేరికిన్.

207


సీ.

మనయింటఁ గలసర్వమణిధనంబులు గొంచుఁ, గాకుత్స్థుఁ గాన నంగదునిఁ బుచ్చి
యారాముతో సంధి యతిభక్తిఁ గావించి, కొని నిర్భయంబున మనుట మేలు
కాదేనిఁ గిష్కింధ క కడువేగమున డించి, ఘనదూరదేశంబు చనుట లెస్స
యొండేని రఘురాముక్తినొద్దకుఁ బ్రాణముల్, పోషించికొన నీవు పొమ్ము బుద్ధి
నీవు దనపాలి కేఁగిన నృపతి నిన్ను, నాదరంబున మన్నించు మోద మెసఁగఁ
జేయు నీ కపకారంబు సేయఁ డాఘ, నుండు శరణార్థిజనరక్షకుండు గాన.

208


అని యిట్లు పెక్కుభంగులఁ, దనరఁగఁ బ్రియ మారఁ దార తజ్జ్ఞతఁ బలుకన్
విని వాలి నిరుత్తరుఁ డై, తనలోఁ దలపోసి కొంతతడవున కనియెన్.

209


క.

ఈకిష్కింధానగర, మ్మీకపిరాజ్యంబుఁ బాసి యే మనఁ జాలన్
నాకుం బ్రియ మిటు చెప్పితి, చేకొని హిత మగుట సంతసించితిఁ దరుణీ.

210


శా.

ఘోరాజిం బడ మోఁది పొ మ్మనిన నాకుం గాక భీతాత్ముఁ డై
దూరాద్రిస్థలి దిక్కు లేక రవిపుత్రుం డుండి దైన్యంబుతో
నారాముఁ బ్రణతాంగుఁ డై కొలిచెఁ గా కబ్జాస్యకై వ్రాలుచున్
వీరత్వంబు దొఱంగి తక్కొరుని సేవింపంగ నా కేటికిన్.

211


మ.

ఉరువింధ్యాద్రి కరంబులం బెఱుకని మ్ముర్వీశుఁ డేపారఁగా
ధరణీచక్రము ద్రిప్పనిమ్ము కనదుద్యత్పావకస్పర్ధి భీ
కరబాణంబులఁ జంద్రతారకయుతాకాశస్థలంబున్ ససా
గరభూలోకముఁ గాల్పనిమ్ము తుది శంకం బొంద నే నింతయున్.

212


క.

రామున కే నపరాధం, బేమియుఁ గావింప నాకు నింతయు నలుగం
డామహితాత్ముఁడు సుగుణో, ద్దాముఁడు సద్ధర్మవిదుఁడు తలఁకకు మబలా.

213


క.

ఉరుతరబలదర్పంబును, బరిపంథిరణంబు సేయఁ బైకొని పిలువన్
బిరు దఱి తొలఁగుటకంటెను, మరణం బెంతయును మేలు మగవారలకున్.

214


చ.

అనిమొనఁ బాఱిపోయి భయ మందక క్రమ్మఱ వచ్చి లజ్జ లే
కినజుఁడు నన్ను మార్కొనఁగ నేపునఁ దా మగవాఁడపోలె గ
ర్జన మొనరించుచున్ మదవశంబునఁ ద్రుళ్లెడు వానిప్రాణముల్