పుట:భాస్కరరామాయణము.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సన్నాంబుప్రవాహసాగరగామినీమహానదులును గుహాప్రస్రవణనిర్ఝరంబులును
బలుశైలశిఖరంబులును వైదూర్యసదృశవర్ణపద్మకువలయప్రభృతిజలకుసుమం
బులును హంసకారండవచక్రవాకబకజలకుక్కుటాదిసలిలపక్షులుం గలతటాకం
బులును నానాపక్షికులకోలాహలకలితస్థలంబులును గలిగి గిరిసన్నిభంబు లయి
మదధారలు గండస్థలంబులం దొరఁగ శైలంబుల శీతదంతంబులం బగులఁ బొ
డుచు మత్తదంతావళప్రభృతిఘనసత్వంబులను వనచరఖేచరశైలచరశకుంతకు
లంబులను జూచుచుఁ ద్వరితగతి నేతెంచి ముందట నొక్కతరుషండంబుఁ బొడ
గని రామచంద్రుండు సుగ్రీవుం గనుంగొని నింగి వెలుంగు మేఘంబునుంబోలెఁ
బరివృతఘనసంకాశకదళీవనశోభితం బయనయీతరుషండం బెయ్యది యెఱుం
గఁ జెప్పు మనిన నినజుండు రఘువరున కి ట్లనుఁ గదళీతరువనపరివృతంబును సర్వ
మూలఫలోపభోగంబును జనశ్రమనిరాసకంబును గృతమునిజనవిశ్రమంబును
నగునియ్యాశ్రమంబునందు జననాథ మునులు సప్తరాత్రంబుల కొక్కవారం
బాహారంబు గొనుచు సమీరాహారులు నిర్జితేంద్రియులును నై సప్తశతవర్షం
బులు తపంబులు నేసి శరీరంబులతోన దివంబునకుం జనిరి వారితపఃప్రభావం
బునం దరువులు దుర్గమప్రకారంబునఁ బ్రాకారంబునుంబోలెఁ బరివృతంబులయి
యుండుట నియ్యాశ్రమంబు దేవేంద్రాదిసురలకు దురాధర్షం బయి యుండుఁ
బక్షులు నన్యవనచరంబులుం బ్రవేశింపకుండు దైవవశంబునం బ్రవేశించినఁ బు
నరావృత్తి లేకుండు నిచటఁ దూర్యగీతస్వనంబులు సకలకథలు మధురాక్షరంబు
లయి వినంబడు పరిమళమందపవనంబు లొలయుచుండు నిమ్ములఁ ద్రేతాగ్నులు
ను గానంబడు నేతదాశ్రమపరివృతవృక్షాగ్రంబుల గరుడప్రభంబు లైనకపోతం
బులు గానంబడు నమ్మునుల నుద్దేశించి కృతాంజలి వగుచుఁ బ్రణామంబు సేయు
మని పలికిన నమ్మహాతేజు లయినమునులగుఱించి రాముండు సలక్ష్మణుండై దండ
ప్రణామంబు లాచరించి సంతుష్టహృదయుం డై యాసప్తజనాశ్రమంబులు
దాఁటి యట దూరంబున బహుపాదపగుల్మమధ్యంబును బహువానరపరివృ
తంబును గాంచనతోరణమండితంబును దురాధర్షంబును నాతతధ్వజయంత్ర
ప్రాకారంబును వాలిపాలితంబును నగు కిష్కింధానగరంబు సేరి యచ్చట వృక్ష
పండావృతుం డై వన మెల్ల వీక్షించుచుండె నప్పుడు సుగ్రీవుండు బ్రహ్మాండం
బంతయు నిండ మహానాదంబు సేసి నీలజీమూతసంకాశుం డగు రామభద్రు
నాలోకించి యి ట్లనియె.

196


క.

నరనాయక కిష్కింధా, పుర మిదె చేరితిమి వాలిఁ బొలియించెద న
న్పరమప్రతిజ్ఞ సఫలముఁ, గర మొనరింపంగ వలయుఁ గాలములోనన్.

197


చ.

అనవుడు ని న్నెఱింగెద రయంబున నీగజపుష్పమాల లాం
ఛనముగ నీవు వాలిపురిఁ జయ్యనఁ జేరి గుహాముఖంబునన్