పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/625

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

135



సం. మొదలు వరకు దామాషాగా నష్టము
1876-77 1880-81 రూ 120 లక్షలు
1881-82 1885-86 రూ. 74 లక్షలు
1886-87 1890-91 రూ. 162 లక్షలు
1891-92 1895-96 రూ. 153 లక్షలు
1896-97 1898-99 రూ. 168 లక్షలు
1899-1900 1904-05 రూ. 111 లక్షలు

viii ఈ కాలములోనే పల్లంసాగు నీటి పారుదలకు కాలువలు త్రవ్వుటకు వీనిమరమ్మతుకు చెరువుల మరమ్మతుకు 45 కోట్ల రూపాయిలు ఖర్చు చేయబడెను.

రోడ్లు బిల్డింగులకు 1896-97 - 1901 మధ్య 4 కోట్లు 1901-04 మధ్య 5 కోట్ల రూపాయిలు ఖర్చు చేయబడెను.

1858 నాటికి పల్లంసాగు 1500000 యకరములు

1906-07 ........... 222 25000 యకరములు

దీనిపైనవచ్చు ఆదాయమువలన ఆ నిర్మాణముల ఖర్చు మళ్లినది. దీనివలన పండుపంటలో సాలుకు 60 కోట్ల రూపాయిల విలువగలపంట ప్రభుత్వమునకు చేరుచున్నది.

1871 లోని లెక్కలనుబట్టి ఇండియా రాజ్యాంగసహాయ కార్యదర్శి సర్ లూయీమాలెట్ గారు 1875 లో తయారుచేసిన లెక్కలవలన చతురపుమైలుకు చూచినను తల 1కి మనిషి పైనచూచినను భూమిశిస్తు అతిభారముగ నుండినట్లు తేలుచున్నది. నికరపంటలో నూటికి 50-60 వంతులుండెను.