పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-పంచమాశ్వాసము

211


తే.

లఖిలభోగాఢ్యమై నిత్యమై వెలుంగు
నట్టి వైకుంఠనిలయవిఖ్యాతిఁ బొగడ
వేదనిదులకు బ్రహ్మకు వేదములకు
నమరవరులకు నాకును నలవి యగునె?

133


క.

కల్పశతకోట్లయందు న
నల్పంబగు విష్ణుపదమహత్త్వము ఫణిరా
ట్తల్పుండును నెఱుఁగం డఁట
యల్పుల తరమే నుతింప నంబుజవదనా!

134


ఆ.

దీర్ఘశృంగములును దెలుపులునై వెండి
కొండ లట్లు పెక్కుకొమరు మిగిలి
యమృతవాహినులకు నాధారమై గోవు
ల ప్పురంబునందు నొప్పు మిగులు.

135


వ.

మఱియును సిద్ధసాధ్యులును విశ్వేదేవతలును బరమజ్ఞానపరా
యణులగు యోగిపుంగవులును మూర్తిమంతంబులగు ఋగ్యజు
స్సామాధర్వణంబులును దివ్యఋషిగణంబులును బరమభాగవతు
లును ననవరత[1]జాగ్రచ్చిత్తులై పరమానందంబునం గొల్చి
యుండఁ బరమపదనాథుండు నిత్యయౌవనుండును నిరవధికభోగ
పరాయణుండును నిఖిలచరాచరోత్పత్తిలయకారణుండును నై
సుఖంబుండు మఱియును.

136


శా.

నీలాభూము లపూర్వయౌవనముతో నిత్యంబు సేవింపఁగా
నీలాభ్రంబునఁ దోఁచు క్రొమ్మెఱుఁగునా నెక్కొన్న వక్షంబునన్
శ్రీ లీలారతి నుల్లసిల్లఁగ సదా శృంగారుఁడై విష్ణుఁ డు
త్తాలైశ్వర్యవిభూతిఁ బొల్పెసఁగుఁ దద్ధామంబునం దెప్పుడున్.

137


వ.

అని యిట్లు పరమధామమహత్త్వంబు గిరిరాజతనూభవ కానతిచ్చి
చంద్రశేఖరుండు మఱియు నిట్లనియె.

138
  1. భాగ్యచిత్తులై (ము)