పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

192

పద్మపురాణము


డజరామరుండు సహస్రశిరోనేత్ర
         పాదారవిందుండు పద్మనాభుఁ
డీశానుఁ డవ్యయుఁ డిందిరాధీశుండు
         సగుణనిర్గుణమూర్తి నిగమ[1]వినుతుఁ


తే.

డనఁగ బహునామములు గల్గు నతని మహిమ
నాకులకునైన విధికైన నాకు నైనఁ
దలఁప వాక్రువ్వఁ బ్రణుతింప నలవిగాదు
వినుము కన్నంత చెప్పెద వనజనేత్ర!

55


క.

వేదములవలన నుపనిష
దాదుల నిర్ణీత మయిన యది యా యర్థం
బా దేవోపాసన బహు
భేదంబులఁ బరఁగు వినుము భీతమృగాక్షీ!

56


వ.

అవి యెయ్యవి యంటేని శంఖచక్రాంకితంబును నూర్ధ్వపుండ్ర
ధారణంబును మంత్రపఠనంబును ధ్యానంబును నామస్మరణం
బొనరించుటయుఁ దత్సంకీర్తనంబు సేయుటయును వినుట
యును నభివందనంబు సేయుటయును దత్పాదోదకసేవనంబును
దత్ప్రసాదభోజనంబును దద్భక్తసేవనంబును ద్వయానుసంధా
నంబు ననన్యారాధనంబును ద్వాదశీవ్రతనిష్ఠయుఁ దులసీరోప
ణంబు తులసీదళభక్షణంబు నను నద్దేవుభక్తి యాద్యంతంబు
షోడశవిధంబు లని చెప్పంబడు నందు.

57


ఆ.

సంతతంబు దేవసమితికి నాకును
బూజనీయుఁ డాదిపురుషుఁ డట్లు
గాన మిగుల భక్తి గలిగి భూదేవతా
వరులకెల్లఁ గొలువవలయుఁ జువ్వె.

58
  1. నిలయు (తి-హై)