పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

190

పద్మపురాణము


వ.

అనిన విని దిలీపుం డిట్లనియె.

44


క.

మునివర! హరిభక్తి సుధా
వనధితరంగములు నీదు వాక్యచయంబుల్
విని తనివి సనదు వెండియు
వినవలఁతు న్విష్ణుభక్తి వినిపింపు తగన్.

45


క.

తాపత్రయాగ్నికీలా
వ్యాపనతప్తంబులైన యాత్మలకెల్లన్
శ్రీపతిభక్తిసుధాంబుధిఁ
బ్రాపింపక భవభయంబు పాయునె యెచటన్.

46


వ.

అట్లు గావున మహామునీంద్రులచేత నుపాస్యమానుండగు పరమ
పురుషు భక్తిభావంబు వినవలఁతుం జెప్పవే యనిన నతనికి వసి
ష్ఠుం డిట్లనియె.

47


ఆ.

<> </>అధిప! వినఁగ దీని నడిగితి విదియ సం
సారఘోరవార్ధిపార మెయ్ద
నరయ శ్రీశుఁడైన హరిభక్తి రససుధా
సేవఁగాక యొండు చెప్పఁగలదె!

48


తే.

లీలఁ గైలాసగిరిమీఁద బాలచంద్ర
ధరుని శంకరుఁ బరమాత్మ గిరితనూజ
యడిగె నీప్రశ్న నీవు న న్నడిగినట్ల
యత్తెఱంగెల్ల వినుము ధరాధినాథ!

49


వ.

అది యెట్లంటేని.

50


సీ.

శంకర! సర్వజ్ఞ! సర్వదేహులకును
        ముక్తిపద మగు విష్ణుభక్తి విధము
తదుపాసనంబును దన్మూర్తిపూజావి
       ధానమంత్రంబులుఁ దద్విభూతి