19
క. | వెన్నెల నీనెడి నవ్వును | I-160 |
సీ. | ఘననీలమణికాంతిఁ గనుపట్టు కొప్పుపై | |
గీ. | గమ్మతావులు కటిపంక్తిఁ గడలుకొనఁగ | I-161 |
పోతే సింగనది ఏమాత్రం కాఠిన్యంలేని సరళసుందరపురాణశైలి.
కాకతీయభానుడు అస్తమించిన తరువాత చీకటిముష్కరులు చేసిన దురాగతాలు ఇంతంత కాదు. దాదాపు పాతికసంవత్సరాలు యావద్దక్షిణాపథం రక్తసిక్తమై పోయింది. కాకతీయుల ఆడపడుచు విశ్వనాథుని శిష్యురాలు రెండవ కంపరాయల భార్య గంగాదేవి తన మధురావిజయకావ్యంలో ఆనాటిఘోరాలను ఈవిధంగా చిత్రించింది.
| సతతాధ్వర ధూమసౌరభైః ప్రాఙ్నిగమోద్ఘోషణవద్భి రగ్రహారైః | VIII-7 |
| మధురోపవనం నిరీక్ష్య దూయే బహుశః ఖండిత నారికేళషండమ్, | VIII-8 |