పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


అవాప్యవాసరం విష్ణోర్యోనరః సంయతేంద్రియః।
ఉపవాసవరోభూత్వాపూజయేన్మధుసూదనం॥

సధాత్రీస్నానసహితో రాత్రౌ జాగరణాన్వితః।
విశోధ యతి పాపాని కితవోహియథా ధనం॥

(సం. నార. ఉత్తరార్ధం-ప్ర. అ-3శ్లో. నుండి 9శ్లో. వరకు)

క.

ఏపున శుష్కార్ద్రములౌ
పాపేంధనకోటులెల్ల భస్మము సేయన్
దీపించు వహ్ని యెయ్యది
తాపసకులనాథ! తెలుపు దయతో మాకున్.


సీ.

మూఁడులోకంబుల మునినాథ! నీ వెఱుం
        గని యది లేదు నిక్కముగఁ ద్రివిధ
కర్మ నిశ్చితము విఖ్యాతమైన జాత
        కలుషంబు లెంచ శుష్కములు జాత
కలుషంబు లార్ద్రముల్‌గా విన్నవించితి
        వార్తకెక్క నతీతవర్తమాన
భావికాలోచిత పాపేంధనంబు లే
        వహ్నిచేనడఁగుఁ బావనచరిత్ర


తే.

యనిన హరివాసరము నియతాత్మమనుజుఁ
డుపవసించి హరి భజించి యుచితభక్తిఁ
గాంచి నిశినెల్లఁ దామేలుకాంచి ధనము
జూదరియుఁ బోలెఁ బాతకస్తోమమడఁచు.

(తె. నార. చతుర్థాశ్వాసము-189పుట. 3, 4 వ.)

ఏకాదశీ సమాఖ్యేన వహ్నినాపాతకేం ధనం।
భస్మతాం యాతి రాజేంద్ర అపిజన్మశతోద్భవం॥

నేదృశం పావనం కించిన్నరాణాం భూప విద్యతే।
యాదృశం పద్మనాభస్య దినం పాతక హానిదం॥

తావత్పాపాని దేహేస్మిం స్తిష్టంతిమనుజాధిప।
యావన్నోప వసేజ్జంతుః పద్మనాభదినం శుభం॥