పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/629

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

జనులు స్వోద్దేశవిహితోపచారములు ప్రి
యంబుతోఁ జేయ స్వమూర్తి యగుచు స్వాంత
రాత్మ నిలిచిన హరికి సమర్పితముగ
నర్భకుం డాతఁడు దలంచె నతినియతిని.

186


తే. గీ.

అప్పు డుఛ్ఛ్వాసముఖ్యకర్మాంతరంబు
లన్నియు నిజాంతరాత్మ సేయింప నేఁడు
సేయుచున్నాఁడ నని జ్ఞానసిద్ధి చేసి
కలికసత్కర్మతాశక్తిఁ గాంచి మించె.

187


సీ.

వాసిగా మృద్బలీవర్ధంబుల నొనర్చి
                       కృత్రిమతంత్రినాకీర్ణదామ
ములఁ దిప్పు హరి విశ్వమును ద్రిప్పు నీక్రియ
                       నని తలంచుచు గృహస్థాశ్రమస్థు
కర్మముల్ పూని తత్కల్పితాన్నాదికం
                       బుల కల్పితేశ్వరపూజఁ జేసి
యర్పితంబులు సేయు నతఁడు కల్పంబులు
                       తెలిసి తేజము గల్గు దివ్యభవన


తే. గీ.

ములు ప్రకల్పించి కల్పితబుధుల నెదురు
కొని ప్రణామంబు లిడి మదిఁ గోర్కు లొసఁగు
నంతఁ దద్భుక్తశేషంబు లారగించు
భగవదనుకూలసద్భక్తిఁ బరిఢవించు.

188


వ.

మఱియు గృత్రిమమఘంబులు గావించి భగవదర్పితంబులు
సేయుచు నుత్సవంబున.

189

ప్రహ్లాదుని విద్యాభ్యాసము

చ.

అనుపమలీల నిట్లు తిరుగాడెడు నాఘనయోగిమౌళికిన్
జని యసమాచతుష్కము నిశాచరుఁడై దవయేఁడు చొచ్చినన్
దనయునిఁ జూచి సత్క్రియలసంఖ్యములై తగఁజేసి సంతసం
బొనరఁగ నక్షరాభ్యసనయోగ్యత గాంచి సభాంతరంబునన్.

190