పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/621

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

ఈలోకములన్నియు నే
నేల సమర్థుండ నైన నెన్నిక సుదయా
శీలుండవు గురుఁ డన్వయ
శాలివి యిఁక ని మ్మనుజ్ఞ సత్కృప మెఱయన్.

155


వ.

నాకు నిట్లు కోరినయట్లనే వరంబు లొసంగు నీయాజ్ఞం జరించెద నని
తత్తపోబలంబున నదేయంబగు వరంబు వేఁడిన నప్పద్మజుం
డిట్లనియె.

156


మ.

క్షితిలో దైత్యకులాధినాయక! స్వతస్సిద్ధంబు నీవిక్రమో
గ్రత; వీరారిదురాసదంబు; తపముం గావించి తామీఁద; సు
స్థితి నీ కే నిట నేమి దుర్లభము చర్చించం గులాచార సు
వ్రతముల్ దప్పకు నాపితామహితసారంబై విజృంభింపఁగన్.

157


వ.

నన్ను మన్నించి సేవించితివి; నేను బ్రసన్నుండ నైతి; సకలార్థ
వాసంబగు నీకు మఱియు నాశీర్వాదంబులు గావించితి. నీవు కోరిన
కోరిక లెల్ల మున్నే నీయందు నున్నయవి; పునఃప్రార్థనంబు సేయుట
సిద్ధసాధనంబు; మహావీరా! శూరపరంతప! వరంబులు గైకొనుము;
ని న్నెవ్వరు వారింప శక్తుం డని మనంబునం గలంగియుఁ గృత్రిమ
వికాసంబు మొగంబునం బొదమ బలాత్కారవరం బొసంగి
యంతర్థానంబు నొందె; వాఁడును బ్రహ్మవరోద్భుద్ధాగాధవీర్యపరా
క్రముండై యంతర్హితుండైన విరించికి దండప్రణామంబు లాచరించి
నిజపురంబునకుం జనియె.

158


సీ.

అంత హిరణ్యకుం డత్యంతదృఢతపో
                       బృంహితవిభవుఁడై పెచ్చుపెరిగి
తనపట్టణమువోలె ధన్యత మూఁడులో
                       కములు నేలె నుదారకర్మశక్తి
మును వైదికప్రభఁ దనరి సామాత్యపు
                       రోహితుండై తత్త్వరూఢి మెఱయు
వైదికుల్ బోధింప వేదనిర్దిష్టమా
                       ర్గంబునఁ బ్రజ నేలి ఘనత వెలయు