పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/618

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

ఆపురిఁ జొప్పడు నున్నత
గోపురములచేత నవ్యగోపుర మనఁగా
గోపురములలో లక్ష్మీ
నూపురమై వెలసె బుధజను ల్కొనియాడన్.

139


వ.

మఱియు నప్పురంబు మేరుకోశసమానయై మేరూత్తుంగశృంగయై సభా
విజితమేరువై రత్నశృంగహేమప్రాకారకోష్ఠకక్షేపణాదులచే మాయా
బలదురాసదంబై వెలయు మఱియు.

140


తే. గీ.

దానవు జయించి నందనావాసతరులు
బాహ్యతలముల నిల్పి తద్భయమువలన
నవి యరణ్యాసులై చుట్టు నాక్రమింప
మించి దీవించెఁ దన్నగరాంచలముల.

141


తే. గీ.

వాసి కెక్కి త్రివిక్రమవాసచరణ
నఖవినిస్స్రుత యగు మహానది తదీయ
పరిఘయై యుండె నరిభయంకరము గాఁగ
నప్పురమహత్వ మెంచఁగ నలవి యగునె?

142


క.

మధురామలోదకములై
సుధ లొల్కు సరోవరములు సొంపగు నచటన్
బుధు లెన్నఁగ బహిరంత
ర్నిధులై మానససరస్తణీకారరుచిన్.

143


క.

అనిమిషఋషిదామంబులు
ఘనుఁ డాతం డాక్రమించి కైకొన నాగో
ధనములు కామగవీకులు
జనితంబు లభీష్ట మగుచు సతతము నందున్.

144


క.

హెచ్చుగ సురజయకలితా
త్యుచ్చైరుచ్చైశ్రవోముఖోత్తమహయముల్
మెచ్చఁగ నైరావతము
ఖ్యోచ్చండోద్దండహస్తియూధము లచటన్.

145