పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/582

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వ.

..................................................................................
నని పరీక్షవాకు లాడకు; అట్లు గాకుండెనేని తత్పదంబు పిమ్మట
శుక్తియందుఁ బుట్టెనని పలుకంబడ దిట్లు దేహాద్యచిద్వస్తువుల
యందు నజ్ఞభ్రాంతిచేతం బలుకంబడిన యివి యుత్పన్నంబు, త్వం
పదంబు దానియందు ననిన శబ్దవేది యపగతంబు సేయండె; పదం
బెక్కడ వ్యుత్పన్నంబగు తద్వాచ్యం బదె యనుట; శ్రుతికి వ్యాకరణం
బంగంబు; దానికి స్మర్త పాణిని; ఇతండు యుష్మదస్మత్పదంబులచేత
నవాచులనియును 'శ్రోతామాంతా' యని వేదోక్తచేతనాన్యం బనందగు;
చేతనుండు వేదోక్తిచేతను భిన్నం బగుటచేత నావస్తువునందు వైదికులు
త్వమహమ్మని ముఖ్యవృత్తిచేతం బ్రయోగింపుదురు; ఉద్దాలకుండు
శ్వేతకేతుని నచిరశ్యునింగా నెఱింగి త'త్వం' పదంబులచేత నను
వాదంబు చేసె; వానికి నచిద్వాచిత్వం బెక్కడిది? యయినను
త్వం పదం బభిన్నముఖ్యవిజ్ఞాతుండైన జాతయందు వ్యుత్పన్నం
బనిన నందువలన నేమి యయ్యెడు ననిన: విను, మచిద్విశేషంబునకుఁ
దత్త్వహానివలన జ్ఞాతృత్వంబులేదు; అచిద్విశేషంబు లెవ్వి కాన్పించు
జ్ఞానశాలురై జ్ఞాతకుఁ ద్వంపదవాచ్యప్రమాణంబుచేత నామీఁద దాని
చేతానాత్మానులక్ష్యంబు చేసి, వానికి నిక్కడ నేకత్వబోధనంబునందు
స్థూలసూక్ష్మావస్థ సర్వప్రత్యద్భూతేశ్వరైకత్వం బగును; తావన్మాత్రం
బుననె జీవబ్రహ్మైక్యంబు సంభవింపదు; అన్యస్థలంబున జీవ
పరమాత్మలకు భేదంబు సిద్ధంబగు.


[1]శ్రుతిః.

"క్షరం ప్రధాన మమృతాక్షహరహః
క్షరాత్మనా విశతే దేవమేకం,
భోక్తా భోజ్యం ప్రేరితారం చమత్వా
జుష్టన్త స్మాదమృతత్వమేతి.”


యనిన శ్రుతివలన సిద్ధంబగు; జీవబ్రహ్మలు దేహదేహివత్వంబుల
చేతం బ్రసిద్ధిఁ గాంచిరి; అంతర్యామి బ్రాహ్మణాదులయందునది గావునఁ

  1. శ్రుతిః: "క్షరం ప్రధాన మమృతోక్ష౽రహః
              క్షరాత్మ నావిశతే దేవ ఏకం
              భోక్తా భోజ్యం ప్రేరితారం చమత్వా
              జుష్టస్త స్మాదమృతత్వ మేతి." (మూ)