పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/561

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


కైవల్యము ననంగఁ గలిగిన యవియెల్ల
                       నొసఁగుచునుండియు నొక్కచోట
నవి నశ్వరములు హేయంబులు తుచ్ఛంబు
                       లల్పతరములను నరుచి పుట్టఁ


తే. గీ.

జేయునవి రెండు మది విమర్శించి ముక్తి
పదముఁ గోరంగవలయు సద్భావశక్తి
నిట్లు కోరిన పరమాత్మ కెంచి చూడఁ
గలదె వైషమ్యబుద్ధి లోకంబులోన.

204


సీ.

త్రివిధజీవ నిజేచ్ఛ తెలివి కర్తుమకర్తు
                       మన్యథాకర్తుం సమర్థశక్తిఁ
దనర నీశ్వరుఁడు తద్వత్సలత్వమునఁ ద
                       దిచ్ఛానువృత్తిమై నెసఁగియుండుఁ
బరమయోగీంద్రులు భవ్యులు సనకాదుఁ
                       లారమాజాని పాదాంబుజాత
భక్తినిష్ఠాశక్తి ప్రబలినకైవడి
                       బ్రహ్మాదినిర్జరప్రవరులకు ల


ఆ. వె.

భించ దట్లుగానఁ బ్రీతి యందఱియందుఁ
గలుగ నెపుడు వార్దికన్యకాక
ళత్రునకును నిది విచిత్రంబు గా దెంచఁ
దత్స్వభావగుణమె తలఁచ నెపుడు.

205


తే. గీ.

అఖిలచేతనసముఁడు పరాత్మవిషముఁ
డౌనె తదభీష్టసిద్ధిదుఁ డయ్యెనేని
తనయులకు నెల్ల సముఁడైన తండ్రి తత్త
దిష్ట మొకలేశ మేనియు నిచ్చినట్లు.

206


వ.

అనిన శుకుం డిట్లనియె.

207


మ.

సనకాదు ల్ఘనయోగు లబ్జజసుతుల్ స్వధ్యానమప్రియా
యనఘుల్ విష్ణునిఁ జూడఁగోరుట నిజంబౌ నట్లు కాకున్నఁ బ్రా
క్తన వాణీశమహేశ్వరాదుల కశక్యంబైన తద్దేవద
ర్శన మెట్లౌఁ దగు విష్ణువత్సలతయున్ సంసేవకైశ్వర్యమున్.

208