పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/547

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తరల.

క్షుధితుఁడైనను రాజపుత్రుఁడు ఘోరవైరిగృహాశనం
బధిగమింపని యట్ల వైష్ణవుఁ డార్తుఁడై ప్రతికూలురన్
మధువిరోధివిరోధులన్ మదమత్తులన్ భజియించి తా
నధికసంపద నందఁగాఁ దగదండ్రు తత్త్వవిదుత్తముల్.

152


తే. గీ.

ఒనర నీశానుకూలురై యున్న సాధు
జనులఁ దచ్చిత్తవిక్షేపశంకఁ జేసి
రూపణీయస్వభావానురూపభోగ్య
భోగములకు నిరోధింపఁ బూనఁదగదు.

153


క.

నిపుణుండను భయసంపద
నుపజీవించు[1]కొను యునికి యొప్పదు విష్ణుం
డపరిమితవిభవుఁ డాశ్రితుఁ
గృపతో రక్షింపఁడే యకించనుఁ డగుటన్.

154


క.

దాసానుదాసరక్షా
భ్యాసముగల హరియుపేక్షయందునె చిత్తో
ల్లాసమున నమ్మియుండుట
దాసులకుం దగుఁ బ్రపత్తితాత్పర్యములన్.

155


క.

భగవత్సంకల్పంబున
భగవత్ప్రతికూలజనులు భవదుఃఖములన్
దగులుదు రామీఁద మఱియుఁ
దగులంగల రఖిలమోహతప్తాత్మకులై.

156


వ.

అర్జునసారథియగు కృష్ణుండు మద్ద్వేషుల నరాధముల సంసారం
బునం ద్రోచెద నాసురయోనులం జనియింపంజేసెద నని యానతి
యిచ్చె నట్లు గావున భగద్ద్వేషిపదార్థోపజీవనంబు వైష్ణవున కనర్ధ
కంబు. విష్ణుద్రోహకారణం బగుటం జేసి దద్ద్రవ్యంబు విడువందగును.

157


సీ.

ఎవ్వనివలన ము న్నెవ్వఁ డర్థముఁ గాంచు
                       నల్పమేనియు మఱి యధికమేని
యొకనాఁడు తనకు నీకున్న నాతని నిష్ఠు
                       రోక్తు లాడిన బాధ నొందఁజేయు

  1. కొని