పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/525

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


నశ్వంబునకు గమనసాధనంబులుంబలె బ్రహ్మవిద్యకు సర్వాపేక్ష
యుం గలదని 'సర్వాపేక్షాచ యజ్ఞాది శ్రుతే రశ్వవత్త'ని సూత్రం
బొనర్చితివి. అయినను నొకసందేహంబు గల దడిగెద.

54


సీ.

యాజ్ఞవల్క్యాదికులైన బ్రహ్మర్షులు
                       జనకాదులైన రాజన్యఋషులు
ఘనతమై కర్మాంగకబ్రహ్మవిద్య ల
                       ధిష్ఠించి శౌరిఁ జెందిరి [1]క్రవ్యాద
వృత్రాదు లగు దైత్యపుంగవుల్ గోపకాం
                       తలు ముకుందుని మనస్థాయిఁ జేసి
కల్పితాకల్పాంగకబ్రహ్మవిద్య న
                       చ్యుతపదం బందిరి సొంపు మీఱి


ఆ. వె.

కఠినులగు హిరణ్యకశిపహిరణ్యాక్ష
ముఖ్యరాక్షసులు నమోఘనిత్య
భావనల నిషిద్ధపద్ధతిఁ బాసి శ్రీ
పతిపదంబుఁ గనిరి పరమనియతి.

55


సీ.

అల హిరణ్యకహిరణ్యాక్షులు వాసుదే
                       వద్వారపాలకు ల్వారు పరమ
ధామంబునం దుండి తలఁగి యధఃపాత
                       మందుట యేమి బ్రహ్మతనుజాతు
లగు సాత్వికులు సనకాదియోగీంద్రులు
                       ప్రాకృతు లట్లు నే భగవదాప్త
దౌవారికులమీఁద దర్పించ నేటికి
                       శాస్త్రవిజ్ఞానసంస్కారహీను


తే. గీ.

లలుగఁ దగుఁగాక హరిభక్తులైన ఘనుల
యెడల సుర ద్రావి మాంసంబు లిచ్చ మెసఁగి
మదవికారముచేత నున్మత్తులైన
చెనటు లె ట్లొనరించినఁ జెల్లుఁగాక.

56
  1. కవ్యాధు