మొట్టమొదట యెన్నిపాదాలు యెన్నిఅధ్యాయాలు యెన్నిశ్లోకాలు ఉన్నాయో సాధికారంగా ప్రమాణపురస్సరంగా మనం యేమీ చెప్పలేము. లభ్యమై నారదీయమహాపురాణంపేరుతో ముద్రితమైన నారదీయపురాణంలో పూర్వోత్తరభాగాలపేరుతో రెండుభాగా లున్నాయి. పూర్వార్థం నాలుగుపాదాలుగా విభజింపబడి ఉత్తరార్థం పాదవిభజనరహితంగా ఉన్నది - పూర్వార్థంలో నూట యిరవైయైదు అధ్యాయాలూ ఉత్తరార్థంలో యెనభైరెండు అధ్యాయాలుగా మొత్తం గ్రంథం 207 అధ్యాయాలతో ఉన్నది. పూర్వార్థంలో 12,774 శ్లోకా లుండగా ఉత్తరార్థంలో 4,525 శ్లోకాలున్నాయి. అంటే ముద్రితమైన నారదీయపురాణంలో మొత్తం 17,299 శ్లోకా లున్నాయన్నమాట.
ముద్రితమైన ఈ నారదీయపురాణంలో అధ్యాయ విభజనాత్మకంగా వివిధశ్లోకాలలో ఈక్రిందివిషయాలు వర్ణితాలైనాయి.
ప్రథమః పాదః
| ధర్మకామార్థ మోక్షోపాయా న్వేదితుం శౌనకాదిభిః కృతే | 1వ అధ్యాయం |
| బ్రహ్మసభాప్రస్థితసనకాదీనాం గంగాతీరే విష్ణుప్రసాదనో | 2వ అధ్యాయం |
| భగవద్విరచితసృష్టినిరూపణప్రసంగేన భూగోళవర్ణన | 3వ అధ్యాయం |
| హరిభక్తి నిరూపణే మృకండ మునేస్తపసా తోషితస్య భగవ | 4వ అధ్యాయం |
| మార్కండేయస్య ప్రళయదర్శనాంతే పురాణసంహితాం | 5వ అధ్యాయం |
| గంగాయమునయోః సమాగమా త్ప్రయాగక్షేత్రప్రశంసా | 6వ అధ్యాయం |
| గంగామాహాత్మ్యప్రసంగేన రిపుజితస్య బాహు భూమిపతే | 7వ అధ్యాయం |