పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/495

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వ.

అనినఁ దద్వచనంబులు విని కంపించి సంధ్యావళి ధైర్యంబు పూని
నగుచు శుక్రసమీరితగాథ పురాణంబులయందు వినంబడియె.
ద్వాదశి స్వర్గమోక్షప్రద యగు. ధనంబు విడుచు, గృహంబు విడుచు,
భార్యల విడుచు, మిత్రుల విడుచు, గురుని విడుచు, బంధువుల విడుచు,
తీర్థంబులు విడుచు, యజ్ఞంబులు విడుచు, ధర్మక్రియాతపస్సాంఖ్య
యోగంబులేని విడుచుంగాని యుభయపక్షద్వాదశీవాసరోత్సవంబు
విడువఁడు. తద్ద్వాదశీప్రభావంబున క్షేమం బయ్యెడి. నీకు సంతోషం
బుగా ధర్మాంగదుని హింసించిన సంతోషమున నుండుము. సత్యంబు
వదలిన నరుండు శ్వపాకపరునకంటె నీచుండగుం గావున సత్యంబు
వదలునే? యని పోయి పతి చరణంబుల వ్రాలి యిట్లనియె.

165


తే. గీ.

ఎంత బోధించినను విన దీరసంబు
మించి హరివాసరమున భుజించు టొండె
తనయు ధర్మాంగదుని తల తఱంగుటొండె
కాని యెవ్వియు నొల్ల దాకలుషశీల.

166


సీ.

తనయునిపైఁ బ్రేమ తల్లికి నధికంబు
                       కనియెడి దుఃఖ ముత్కటతరంబు
తండ్రి బీజావాసధర్మహేతువు గాని
                       తల్లిపాలనము వర్ణనము చేయ
నోపు లోకంబున నూర్జితసత్యవ్ర
                       తంబు నిల్పఁదలంచి ధరణినాథ!
శతగుణాధికపుత్రసౌహార్ద మాత్మకు
                       వదలితి నీవు సత్పథము నంద


తే. గీ.

ఘనుని ధర్మాంగదునిఁ బుత్రుఁ డనక చేతి
హేతిఁ బరిమార్చి మెడమీఁద నిడి శిరంబు
గాంచి హర్షించితేని యాకాంత కొసఁగు
వరము ఫలియించు ననియె నావశ్యకమున.

167


వ.

ఇట్టి యాపత్పరంపరలు తరింపంజేయ నీశ్వరుండు గలఁడు. శిబి
శ్యేనంబునకు మాంసం బీఁడె? పురందరునకుఁ గర్ణుండు చర్మం బొప్పిం
పఁడె? జీమూతవాహనుండు గరుత్మంతునకుఁ బ్రాణం బొసంగఁడె?
దధీచి దేవతలకు నెమ్ములు విసర్జింపఁడె? కీర్తి ధర్మంబు సత్యంబు
నిలుపుకొనవలయు. ఈమోహిని ధర్మభ్రంశంబు నొందింప విధాత
నిర్మించినవాఁడు. పుత్రహింసకునిపై దేవతలు వైముఖ్యంబు నొంద