పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/487

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


మ.

నను నెల్లప్పుడు నేఁచు రాక్షసుఁ డనూనక్రోధధూమ్రాక్షుఁడై
మును, దీనిం జెఱదెచ్చె నగ్గలికమై మోహించి సాపత్న్యదుః
ఖనిరోధం బొనరించె వీఁడు మిగులం గష్టాత్ముఁ డేమందు నీ
దనుజస్త్రీ పతిఘాతశీల (?) యని యాత్మన్ నమ్మఁగా నేర్తువే?

141


వ.

అయిన నేమి? నమ్మినవానిం దెగటార్చిన బ్రహ్మహత్యాపాపంబులని
యెఱుంగనే?

142


ఆ. వె.

నమ్ము నమ్ము నన్ను నమ్మినవాఁ డని
నిన్ను నిర్వహింతు నిజమనోధి
రాజయైన యంత[1]రాత్మయుఁ బంచభూ
తములసాక్షి నీవె ధవుఁడ వెంచ.

143


వ.

అనినఁ దద్వాక్యంబులు సత్యంబులుగాఁ దలంచె నంత రాక్షసి నిజమంది
రంబునంగల సకలధనంబులు సంగ్రహించుకొని కరేణురూపంబున
బ్రాహ్మణునిం బైనిడుకొని రాజపుత్రియైన రత్నావళి నదృశ్యకరణ
శక్తిం దోడుకొని తృతీయముహూర్తంబున శంకరాలయంబున కరు
దెంచి కాశీపురంబు చూపి యిది పాపతరుకుఠారంబు. ఇది సంసార
గేహపాదకం బిది షడూర్మికూర్మసువర్ణద్యూతం బిది కర్మబీజోష
రం బిది సద్గతిమూలం బిది పురాణంబుల వైష్ణవస్థానం బని వర్ణింపు
దురు. శంకరుం డెన్నిదివ్యతీర్థస్థలంబులు దిరిగిన బ్రహ్మహత్య
దొలంగదయ్యె నిది విడిచిన నేమి యగునో? యని ప్రార్ధించిన నారా
యణుం డిచ్చె నిది శివునకు. నాఁడు మొదలుకొని శివక్షేత్రం బయ్యె
నిది భోగాభిలాషుల కేని మోక్షదాయకం బిందునున్నవారికిఁ గాల
భైరవుం డనేకవిఘ్నంబులు గల్పించు నిందు సిద్దింబొందిన చంచ
లాత్ములకేని ముక్తి కరతలామలకంబగు. ఈరత్నావళితండ్రి
ప్రతాపశాలి యీపట్టణం బేలు నతనికి నీకన్యక నర్పించుము. ఈ
క్షేత్రంబు భుక్తిముక్తిప్రదాయకంబు అని విన్నవించిన విని
బ్రాహ్మణుండు రత్నావళితో దిగు నంత.

144


క.

పీనోత్తుంగపయోధర
మై నారీలీలఁ దాల్చి యారాక్షసి సు
శ్రీ నరుగుదేర విప్రుం
డానృపకన్యాపురమున కప్పుడు చనియెన్.

145
  1. అఖండయతి