పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/442

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


లకు యశంబు దొరకనియట్ల, యనుద్యోగికి సుఖంబు చేకూఱనియట్ల,
యభార్యునకు సంతతి జనింపనియట్ల, యనశ్వునకుఁ బృథివీపాల
నంబు సంభవింపనియట్ల, యగజునకు సంగరంబు జయింప సామ
ర్థ్యంబు పుట్టనియట్ల, యనగ్నికి మృష్టాన్నంబు సిద్ధింపనియట్ల, రివు
నకుఁ బ్రియోక్తు లుదయించనియట్ల, యప్రశ్నునకు నెఱుంగంబడని
యట్ల, యగమనునకు నడువ శక్తి లేనియట్ల, జాగరవంతునకు
భయంబు గనిపించనియట్ల యటుగాన నన్ను ధర్మాంగదుగృహం
బున విడిచి రాజ్యసుఖంబుఁ గోరెద వి ట్లుచితంబే యని కన్నుల
బెళఁకు, మేనితళుకు, సిగ్గుకళుకు దొలఁకఁ బుత్రసన్నిధానంబున
గుణనిధానంబన నున్న మోహినిం జూచి యిట్లనియె.

291


మ.

లలనా! నే నధికారకృత్యమున నాలస్యంబుఁ గావింప ని
స్తులమార్గశ్రమ నిద్రఁ జెందితి దరిద్రుం డర్థపుంజంబుఁ ద్రో
వల వీక్షించినయట్ల ధర్మగుణభవ్యశ్రీల ధర్మాంగదుం
డలఘుం డెట్లు నొనర్చె నర్చనలు నీ కానందమై యుండెనే.

292


వ.

అనిన మోహిని యిట్లనియె.

293


సీ.

ఆత్మేశ యంతఃపురాంగనల్ న న్నుద్వ
                       హించినమొదలు ననేకకామ
భోగనిరాశలై పొగులుచు నున్నవా
                       [1]రింక నూరార్పు హితేరితముల
వరరూపలావణ్యవతులైన జ్యేష్ఠభా
                       ర్యలశిరంబునఁ బ్రియమైన దా
మృత్యువుగా నిల్పి మెఱయించు వానిపై
                       ననురక్తి గలదె తదంగనలకు


తే. గీ.

నట్టికాంతలచేతఁ బంచాస్త్రకేళి
గలదె యనుకూలసాధ్వులు గలుగ నాకు
నగునె కల్యాణలక్ష్మి నన్నట్టి సాధ్వు
లాగ్రహించిన నేరీతి నగుదు నొక్కొ.

294
  1. రింక నుల్లార్పు హితోక్తి రతుల