పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/415

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

ఇటువంటి సాధ్వికడుపునఁ
గుటిలారివిభేదియైన కొడు కుదయించెన్
బటుతరమదోత్కటోద్భట
పటహార్భటి హరిదినప్రభావము నెరపెన్.

160


సీ.

నా మాట జవదాఁటఁ డేమియునేని లో
                       కమున సత్పుత్రుని గనినవాఁడ
నేను జంబూద్వీప మేలితిఁగాని స
                       ప్తద్వీపములు నేలె బాహుశక్తి
రణమున వైరి[1]ధరాతలేంద్రుల గెల్చి
                       యనగ విద్యుల్లేఖ యనఁగ మించు
దాని నా కర్పించె దర్పించి విక్రమ
                       ద్రవిణశాలుర నయుతద్వయము ద


తే. గీ.

శాధికంబున నోర్చి నిరాయుధత్వ
మందఁజేసి జయించె బాల్యమున శ్రీప్ర
భుత్వపరరాజ్యమున కేఁగి పూని కాంచి
యేర్చి యెనమండ్రుకన్యల నిచ్చె నాకు.

161


క.

దివ్యపటదివ్యభూషణ
దివ్యమణిప్రదరములను దీపించఁగ వా
స్తవ్యుం డాతఁ డొసంగెం
భవ్యంబుగ జననికిన్ శుభప్రదనిధికిన్.

162


క.

అకలంకచిత్తుఁ డాతం
డొకనాఁ డీపృథివియెల్ల నుల్లాసముతోఁ
బ్రకటముగఁ దిరిగి మత్పా
దకమలజాభ్యార్చనము ముదంబునఁ జేయున్.

163


వ.

మఱియు విశేషంబునం బ్రాప్యజనంబు శిక్షింపుచు నిశాంతరంబున
నప్రమత్తుండై మద్ద్వారంబుఁ గాచికొని జనుల మేల్కొలుపుచు నుండు.
అప్రమేయంబులగు వైభవంబులఁ దనయుం డిట్టి మహాతనయుండు
గలుగ గృహంబున శుభభోగ్యద్రవ్యంబులు గలవు. శుభాకార
ప్రయోజనంబులు గలవు. వాజివారణరథధనధాన్యంబు లనంతంబుగాఁ

  1. ధరాతలేంద్రులఁ గెల్చి