పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/378

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


గీ.

సకలనిశ్శ్రేయసార్థిహస్తగతఫలము
నభినుతించి భజించి నృత్యంబు సలిపి
యనఘులై చేరి వీరధ్వజార్యదత్త
[1]విత్త మంత నివేదించి బత్తి మ్రొక్కి.


వ.

సర్వకర్మనిర్మలులగు నమ్మునులు, సువర్ణంబు రత్నంబులు నంబ
రంబులు రాజార్హంబగు నాసనంబులు చామరంబులు ఛత్రంబులు
చందనాదిసురభిద్రవ్యంబులు నంగీకరించినఁ గల్యాణతీర్థంబున
కుమారులు పరమభక్తి నారాయణు సేవించిన వారలం జూచి యా
దయారసాంబుధి యేను సంప్రీతిం బొందితి మిమ్ముఁ గాంచి భక్తి
సంభ్రాంతసర్వాంగులగు భక్తులే నాకు ధనంబు. ఏను గృపారస
పరవశుండం గృపయు భక్తిపరాధీన భక్తులు భక్తిపరాధీనులు భక్తియు
మత్ప్రసాదంబునం బుట్టినయది. మత్ప్రభావంబు భక్తపారవశ్యంబే
కాని యితరంబు లేదు. ఏను మీతోఁ బాసి వైకుంఠంబున నుండ నొల్ల.
ఇచ్చటనేని వైకుంఠంబుననేని మీతోఁ గూడి వర్తింపుదు, నెపుడు మీర
లిందుం డధికారావసానంబున వైకుంఠంబు నొందెదరు. వింధ్యారణ్య
వాసంబులగు నీహరిణంబులు దూరంబుననుండి వచ్చినయవి. వీనికిం
బరమపదంబు కృపసేసితిని. ప్రభావంబు మీకేయగు భవదన్వయంబునఁ
బశువులు సురదుర్లభంబైన పరమపదంబు నొందె. తృణచర్వణంబు
చేసి మదగ్రంబున సంచరించి కల్యాణతీర్థోదకపానంబు చేసి మాతృ
స్తన్యపానంబు సేయఁడు గాన నిది వైకుంఠవర్ధనంబను పేరి స్థానంబున
ప్రాజ్ఞుండేని పామరుండేని పశువులేని పక్షులేని నన్ను జపించినవారు
వైకుంఠంబు వృద్ధిం బొందింతురు. ఎవ్వరు కళ్యాణతీర్థంబునం దానంబు
సేయుదురు వారికి సహస్రగుణితఫలం బప్పుడె కలుగు నొక్కధేనువు
నేని కల్యాణతీర్థసంయుతుండై యొసంగినఁ గోటిప్రదానఫలంబులగు.
మఱియు దరిద్రుండైన విష్ణుభక్తునకుఁ గల్యాణతీర్థతీరంబున క్షేత్రం బొ
సంగినఁ దత్క్షేత్రరేణుసంఖ్యాతంబులగు వత్సరంబులు స్వర్గంబున
వసియించి యీప్సితంబు లనుభవించి యంతంబున నన్నుం గలయుఁ
గాకున్న భూమియందు సార్వభౌముండై పుట్టి పిదప నన్నుం జేరు
నెన్నఁటికి వాని విడనాడ. కల్యాణతీర్థతీరంబున బ్రాహ్మణభోజనం
బిడినఁ గాలత్రయంబునఁ జతుర్ముఖుండగు. కల్యాణతీర్థంబున వస్త్రం
బొసంగిన శ్రీమంతులై ముయ్యేడుతరంబులవారు సంసారం బుద్ధ
రింపుదురు. కల్యాణతీర్థతీరంబున ధనం బొకనికిం జాలున ట్గొసంగినం

  1. వితమంతయు నట నివేదించి మ్రొక్కి (యతిభంగము)