పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/376

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


నపుడు సహస్రసంఖ్యాతిబలోద్ధతుల్
                       భటు లుదయించి యుత్కటనిజాస్త్ర
సమితి నోర్చిన ధరాస్థలియందు నొరగిన
                       గాధేయుమహిమఁ దద్ఘనులు మెచ్చి


గీ.

యద్భుతం బంది కొనియాడి యతులతుంగ
శృంగమండలమండితచిత్రశాఖ
శాఖకావృతమై యక్షసాధ్యసిద్ధ
దివ్యపరమైన యదుగిరి తెలివి గాంచి.

169


క.

దూరంబున నానిర్జర
వారంబులు మ్రొక్కనున్న వరమౌనులు శ్రీ
నారాయణపదసేవా
పారాయణు లఖిలలోకపావనమూర్తుల్.

170


వ.

ఇది పరమధర్మంబైనయది యని హరిధామంబుఁ గని మ్రొక్కి యా
శైలంబున నధివసించి నేత్రామృతపానంబుగా నిరీక్షించిరంత.

171


సీ.

ఆనగరాజిమధ్యమున లక్ష్మీకళా
                       భ్యంచితమై వియదంతరాళ
సంవారకానేకసాలాభిరామమై
                       నానామహీరుహోద్యానలక్ష్మి
గనుపట్టె నిరుపమాకలితనిత్యోత్సవ
                       ధ్వజసమావృతదిశాంతమయి కాహ
ళీభేరిదరమురళీమర్దళధ్వాన
                       కలితమై జయశబ్దమిళితమై ప్ర


గీ.

శంసకామ్నాయఘోషభాస్వరము సౌధ
సౌధవిన్యస్తదీపికాసముదయంబు
నైన యొకపురిఁ గనిరి తదగ్రసీమ
నమ్మహామును లత్యంతహర్ష మొదవ.

172


క.

ధవళాతపత్రచామర
వివిధశ్రీ విస్తరిల్ల శ్వేతద్వీపం
బువలెం గనుఁగొను గీర్వా
ణవరుల కానందరసము నల్గడలఁ దగన్.

173