పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/375

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


విశ్వామిత్రుం డెట్లు నిత్యోపవాసి యయ్యె? నని యడిగిన వసిష్ఠుం
డిట్లనియె.

164


సీ.

నియమంబున స్వభార్యనియతుండనై యుక్త
                       కాలంబుననె రతికేలి సలిపి
యుండుట మఱి నాకు యుక్తంబు బ్రహ్మచా
                       రిత్వంబు జగము వర్ణించి పొగడ
గాధిపుత్రుఁడు కమలాధిపభక్తిని
                       ష్ఠాపరాయణుఁడు ప్రశస్తి గాంచి
జాత్యాశ్రయనిమిత్తసత్కర్మములు పూని
                       వీతదోషముగ నైవేద్య మొసఁగి


గీ.

యదియు ననిషేధకాలంబునందుఁ గృష్ణ
యనుచు గోవింద యనుచుఁ బరాత్మ యనుచుఁ
బ్రతికబళమును నుడువుచుఁ బరిభుజించె
వాసి నటుగాన నిత్యోపవాసి యయ్యె.

165


వ.

అనిన నరుంధతి విని హర్షించె నట్లుగాన హరిభక్తి లేని నీగృహంబున
భుజియింప నర్హంబుగా దుంఛవృత్తి భక్తుఁడు గావున తద్గృహంబున
భుజియించితి మనిన విశ్వామిత్రు వాక్యంబులు విని యతిథిప్రియుం డా
విశ్వామిత్రుం బ్రశంసించి సాత్వికవృత్తి వహించి చనియె నంత నమ్ము
నులు గోదావరీతీరంబున నున్న హరిణంబులు తమ్ము నీక్షించిన యంతనె
విమలహృదయంబులంగాఁ జేయుచు హరిణంబులుం దాముం జనిం చని.

166


క.

అక్కడ వీరధ్వజుఁ డన
నొక్కమహావీరవైష్ణవోత్తముఁ డురుస
మ్యక్కీర్తిశాలి యిచ్చెన్
జొక్కంబగు కనకరత్నశుభ్రపటంబుల్.

167


వ.

అవి గొనుచు వారలు.

168


సీ.

నారాయణున కర్పణము సేయ నరుగుచోఁ
                       బశ్యతోహరు లుగ్రపౌరుషమున
గదియ వచ్చిన వారి గాధిపుత్రుండు ద
                       క్షిణకరంబున నివసించె నడవి