పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/370

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

అత్తఱి నత్తరిలో దిగి
యుత్తమగురు జహ్నునందనోదకమున నా
సత్తములు తీర్థమాడి మ
హత్తరకల్మములు దీర్చి రనురాగమునన్.

135


తే. గీ.

సర్వమంత్రరహస్యప్రశస్తుఁడైన
యాదినారాయణునిఁ దమయాత్మలోన
నిలుపుకొని శుద్ధచిత్తులై నిత్యకర్మ
మాచరించిరి వేడ్క నయ్యఖిలమునులు.

136


క.

కొందఱు విధిచోదితులై
పొందిక నొనరిచిరి కరములు విష్ణ్వాజ్ఞా
కందళమునఁ గావించిరి
కొందఱు వైష్ణవులు తదనుకూలత మెఱయన్.

137


వ.

అంత.

138


క.

నలినోత్పలశోభితయై
తిలకించిన నర్మదానదీమణి నతిని
ర్మలశక్తి గడచి తా ర
వ్వల గోదావరికి నేఁగి వరనియమమునన్.

139


వ.

వర్తించునంత.

140


సీ.

తత్తీరమున నన్నదానపరాయణుం
                       డతిథిప్రియుండను నతఁడు విష్ణు
భక్తినిష్ఠాగుణపారాయణుం డుంఛ
                       వృత్తియను నతండు వెలయుచుంద్రు
వారిలో నమ్మునివర్యులఁ గని యతి
                       థిప్రియుం డాతిథ్యదృష్టి పూని
పాటించి నిత్యంబు బ్రాహ్మణోత్తమసహ
                       స్రమునకు నిడుదు భోజనము మీరు