పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/349

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


పరమానందంబున విహరించు. విష్ణునకు దివ్యరూపంబు లనేకం
బులు గలవు. వాసుదేవాదులు కొన్ని, కేశవాదులు కొన్ని, పద్మ
నాభాదులు కొన్ని, లక్ష్మీగాఢోపగూఢంబులైన రూపంబులసంఖ్యం
బులు గల వనురూపరూపంబుచే నేర్పడిన సర్వశ్రేష్ఠులగు లక్ష్మీనారా
యణులకు దాసదాసీజనంబులైన బ్రహ్మరుద్రాదిదేవతలు గలరు.
నారాయణుండు సృజించి రక్షించి యంతంబున విశ్వంబు హరించు,
నందునకు లీలం గారణంబు పృథివి ఘటికాయంత్రనిత్యారోహావ
రోహంబులచేఁ గర్మమాలికయందుఁ దిరుగువారిఁ జక్రాయుధుండు
తత్కర్మచక్రంబువలన(నుండి) నివారించుం గాన తచ్చరణార్చ
నంబే ప్రతిదినంబు గావింపవలయు. వర్ణాశ్రమాచారభ్రష్టులు విష్ణు
పూజార్హులు గారు. మఱియును.

35


క.

హరిపూజకుఁ దులసీదళ
మరయఁగ నానందకంద మది లేకున్నన్
స్మరియించినఁ దత్ఫలదం
బరవిందాక్షునకుఁ దులసి యర్హం బెందున్.

36


తే. గీ.

పద్మకల్హారచంపకభర్మకుసుమ
పూజఁ గావించ మెచ్చఁ డంభోజనాభి
శ్రీకరంబైన నవతులసీదళములఁ
బూజఁ గావింప [1]మెచ్చు నీభూమిలోన.

37


వ.

ఇందునకుఁ బురావృత్తం బెఱింగించెద.

38


సీ.

ధర్మకేతుండను ధరణీశ్వరుఁడు మున్ను
                       మునివృత్తిఁ జేసె నమోఘమహిమ
ధర్మంబులన్నియుఁ దద్ధరాశాసిత
                       హితుఁడైన నిజపురోహితునిఁ బిలిచి
యఖిలధర్మంబులు నఖిలవ్రతంబులు
                       నఖిలయజ్ఞంబులు నాచరించి
నాఁడ నారాయణనగమున నారాయ
                       ణార్చనం బొనరింతు ననుదినంబు

  1. నట్ల