పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ఖదిరపలాశసమిజ్జాలంబులచే యజనంబు చేసినఁ బరమపదంబు
లభించు. తత్తీరంబునందు యాదవేంద్రుండను నతండు తపంబు చేసి
యింద్రపదంబు నొంది పిడపం గైవల్యంబుఁ గాంచె. అయ్యాదవగిరి
దక్షిణపార్శ్వంబునఁ బరిధానశిల గల దాశిలకుం బ్రణామం బాచరించిన
వారికి సురాసురులు ప్రణామంబులు సేయుదురు. శిల శుద్ధసత్త్వ
మూర్తి గాన స్పృశించిన సత్త్వగుణము వొడము. ఐశానపాషండ
కాణాదులు భూమియందు వక్రవచనక్రమంబున వేదంబులు దూషించిన
నామ్నాయంబులు శిష్యులుగా నేను మానుషరూపంబున దత్తాత్రే
యుండనై త్రిదండధారినై యందుఁ గాషాయంబులుగాఁ జేసిన మత్పరి
ధానంబుచే శిల పరిధానశిల యయ్యె. అచ్చట నరులు కాషాయశాటికా
పరిగ్రహంబు చేసిన వారి ననుఁగా భావించి వందనంబు సేయందగు.
మద్భక్తులలో నుత్తమోత్తములు వారు. శిష్యులకు వేదం బర్థయుక్తం
బుగా నెచ్చట నే నుపదేశించితి నది వేదపుష్కరిణి యండ్రు. యాదవ
నగాసన్నభూమిని వేదపుష్కరిణి పశ్చిమభాగంబున దర్భతీర్థంబు
గలదు. మహత్తరదర్భప్రరోహంబులందు జనియింప నేను సన్న్యాసి
రూపంబు గైకొని నాదు తద్దర్భసంగ్రహం బెచ్చట నొనర్చితి నది
దర్భతీర్థంబు. సమస్తపంచరాత్రంబును నెవ్వండు ప్రవర్తకుండు,
ఎవ్వనిచేఁ బాంచకాలికధర్మంబు విశదంబుగాఁ జేయఁబడియె నట్టి
శాండిల్యుం డచ్చట నన్ను నారాధించె నది ప్రసిద్ధక్షేత్రంబు. తత్రత్య
దర్భశయ్యాశ్రితులై సంసారధర్మంబు విడుచువా రంత్యంబున విముక్తు
లగుదు రచ్చట.

501


తే. గీ.

తద్గిరీంద్రము దక్షిణస్థలమునందుఁ
గలదు తీర్థోత్తమంబు విఖ్యాతమహిమ
నమరమునులు పలాశతీర్థ మని దాని
సన్నుతించిరి ధారుణీస్థలమునందు.

502


క.

పాత్రత్వ ముడిగి విశ్వా
మిత్రమహాశాపవహ్ని మిడుకఁగఁ బుణ్య
క్షేత్రం బిదియె వసిష్ఠుని
పుత్రులఁ బావనము చేసెఁ బూని మదాజ్ఞన్.

503