పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


చ.

మనుజుఁడు తద్విమానపరిమార్జన సేచన ధూపదీపమం
డనము లొనర్చెనేని ప్రకటస్థితమై ధవళాతపత్ర వీ
జనచతురంతయాన ధనసంపద గైకొని పుత్రపౌత్రవ
ర్ధనమునఁ జక్రవర్తి యయి ధారుణి నేలి విముక్తుఁడౌఁ దుదిన్.

494


సీ.

ఫాలభాగముననె పరమభాగవతస
                       త్తము లూర్థ్వపుండ్ర మత్యంతనియతి
ధరియింతు రవయవస్థలముల నన్యంబు
                       లందునేని వహింతు రతిశయమున
వారి సంశుద్ధభావంబు విలోకించి
                       వెఱతురు దానవుల్ మఱియుఁ బ్రేత
భూతపిశాచోగ్రబేతాళజాతులు
                       నిలువ రగ్రంబున నిబిడశక్తిఁ


తే. గీ.

దెల్లదీవిని శ్వేతమృత్తిక హరించి
తెచ్చి మచ్ఛాసనంబున దివ్యనగము
నందు ఖగభర్త యొకగని నది యొసంగెఁ
దన్మహత్వంబు సెప్పఁ జిత్రంబు గాదె.

495


వ.

సత్త్వప్రకృతిశుద్ధమృత్తికయు శుద్ధము తద్దివ్యస్థానంబును శుద్ధసత్త్వ
మయంబు.

496


మ.

యదుశైలాగ్రశిఖాంతరంబున జగంబౌ నౌననం గామిత
ప్రదయై నిర్ఝరధార యొకటి ప్రదీప్తశ్రీమహాపాపగ
ర్వదయై లోకములెల్ల నెన్నికొనఁగా వైకుంఠగంగాఖ్యయై
పొదలు న్విష్ణుపదంబునన్ వెడలి యీభూమిన్ విజృంభింపుచున్.

497

యాదవశైలము - అచటి విశేషములు

క.

తత్తీరావాసంబునఁ
దత్తోయస్నానదానతర్పణవిధులున్
దత్తత్త్వస్తోత్రంబును
జిత్తస్థితిఁ జేసెనేని చేకురు ఫలముల్.

498