పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

గణము గొడుగులు టెక్కెముల్ కలితసుభట
వందిమాగధజననుతవైభవంబు
దనరు శోభనమంటపాంతరమునందు
నసమమాణిక్యపీఠిక నధివసించి.

290


తే. గీ.

పద్మమిత్రప్రసాదలబ్ధశ్యమంత
కమణితో సత్రజిత్తు రా నమరు దద్వి
శాలరత్నంబు రవి యని సంశయంబు
నపుడు దెలిసి మురాంతకుం డభిలషింప.

291


తే. గీ.

బహుధనమునకు నీక యల్పమతి నేఁగె
నతఁడు తత్సోదరుఁడు మృగయావిహార
మునకు నామణిఁ బూని తాఁ బోవ నంత
నడవిలోపల మృగరాజ మతని నడఁచె.

292


తే. గీ.

జాంబవంతుండు దానిఁ దత్సమయమున హ
రించి మణిఁ గొని గుహలో వసించె నంత
సత్రజిత్తుఁడు నిందింపఁ జక్రధరుఁడు
సత్రజిద్దేవముఖ్యులు సన్నుతింప.

293


వ.

పౌరజనంబులు దానును నరణ్యానీకమధ్యంబునకు నేఁగి.

294


క.

కూలినహయమున్ ధరపై
వ్రాలిన నాఘనుఁ బ్రసేను వధియించి ధరన్
దూలినసింహముఁ దెలుపం
జాలిన భల్లూకపాదసరణియుఁ గాంచెన్.

295


వ.

కాంచి తత్పాదసరణి జాంబవన్నివాసగుహాద్వారంబు చేరి.

296


ఉ.

ఆగుహవాత నందఱ నిజాప్తుల నుంచి మురారి చొచ్చి తే
జోగరిమంబు కల్మి వరసూర్యుఁడపోలె వెలుంగు తన్మణి
శ్రీఁ గని యంది పుచ్చుకొని చేరిన భల్లుకరాట్సుతాంగర
క్షాగతధాత్రి బొబ్బలిడ నాముదియెల్గు మహోగ్రమూర్తియై.

297


వ.

కదిసిన.

298