పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వ.

అంత మఱియును.

98


సీ.

దధిఖండసిక్తనలినశాల్యన్న
                       విరళశిక్షకపుంజసరసఖండ
నాగరైలాచూర్ణనారికేళశకల
                       లవణాంబుమిశ్రమై వివిధగంధ
మొనరఁ జిక్కమునఁ బెట్టిన చట్టి శృంగిబే
                       రామలకామ్రవేత్రాంకురాగ్ర
బార్హత ముఖ్యశోభనము తానూరుఁగా
                       యలు వ్రేళ్ళఁ బొసఁగ నిజాప్తజనకృ


తే. గీ.

తేష్టసల్లాపగోష్ఠితో నెలమి దగ భు
జించె గోపకులును దాను జిత్రరుచుల
సరవి మెచ్చుచు ఖేచరవితాన
మపుడు భుక్తోజ్ఝితములకు నాసపడఁగ.

99


వ.

అప్పుడు.

100


క.

మొలవంకరైన యుంగర
ములు గుంజాభూషణాంకములు మూపులపైఁ
జలకంబళములు దండము
లలరఁగ గోపకులు నడిచి రావులవెంటన్.

101


క.

విశదధ్వజాబ్జవజ్రాం
కుశశంఖరథాంగకల్పకుజచామరము
ఖ్యశుభపదరేఖ లిల నన
దృశచిత్రత కరప వాసుదేవుఁడు నడచెన్.

102


వ.

అప్పుడు జలజసంభవుండు వత్సవత్సపాలకుల నపయింప శౌరి తత్స్వ
రూపంబులు దాన యగుటంజేసి యాచతురాననుండు లజ్జావనతాన
నుండై భగవంతుని గని.

103


దండకము.

లక్ష్మీపతీ! నీమహత్వంబు డెందంబునందు న్విచారింపఁగా లేక
మందుండనై దుష్టకర్మంబు గావించితిన్ మత్పతీ! యేరజోవృత్తివాఁడన్
విమూఢుండ గర్వాంధుఁడన్ నన్నుఁ బాలింపవే దీనకల్పద్రుమా! మించి