పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

అప్పుడు వసుదేవుఁడు సుతుఁ
దప్పక వీక్షించి కన్నుఁదమ్ముల నశ్రుల్
చిప్పిల్ల హర్షగద్గద
మొప్పు మెఱయ మేనఁ బులక లొదవం బలికెన్.

50


క.

అజరుద్రాదులకైనను
భజియింపఁగ రాని నీదుపావనచరణాం
బుజయుగళిఁ గంటి నీశ్వర!
గజవరద! ముకుంద! కృష్ణ! కమలాధీశా!

51


వ.

అని పలికి దివ్యరూపోపసంహారార్థంబుగాఁ బ్రార్థించినఁ దదనుమతం
బునఁ జిఱుతబాలుఁడైన యాకృష్ణుని నందవ్రజంబుఁ జేర్చి వసుదేవుండు
యశోధరాపుత్రికయగు మహామాయను నిజసతి సూతికాశయ్యను నిలిపె.
వసుదేవనందనుం డచట నంత.

52

శ్రీకృష్ణలీలలు - దుష్టసంహారము

క.

పూత నరనింద్య యగు నా
పూతన వీనులు నిమిరి యపుడు చన్నడఁగా
యాతన నొందాపుచు నా
యాతన [1]యార్భటి మురారి యడచెం దానిన్.

53


వ.

అంతటఁ గపటశకటంబు వికటంబుగా నుగ్గుచేసి తృణావర్తు నార్తుం
గావించి మరియును.

54


క.

నవనీతచోరుఁ డని తను
నవనీతల జనులు పొగడ నలరి జననికిన్
వివరముగల యాదొరముఖ
వివరంబునఁ జూపె విశ్వం బచటన్.

55


క.

ఖలమర్దనుఁ డాతఁ డులూ
ఖల కలన దలిర్ప మద్దికాయలరుచులున్
బెళుకుగ మద్దుల ద్రుంచెన్
మలయుచుఁ బ్రౌఢిమకు హద్దుమద్దులు గాగన్.

56
  1. యార్భట