పుట:చతుర్వేదసారము (పాల్కుఱికి సోమనాథుడు).pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

ప్రసిద్ధవీరశైవకవి యగు పాల్కురికి సోమనాథుఁడు రచించిన పద్యకృతులలోఁ జతుర్వేదసారము చాల ప్రఖ్యాతమైనది. సోమనాథుఁడే పండితారాధ్యచరిత్రావతారికలో నీకృతి రచియించినట్లు తన్ను భక్తులు ప్రశంసించినట్లు చెప్పినాఁడు.

"వరవీరభక్తి సవైదికంబుగను
విరచించితివి చతుర్వేదసారమున”

ఈ గ్రంథమున శివపారమ్యము, వీరిశైవతత్త్వము, శ్రుతిస్మృతిపురాణేతిహాసములనుండి ప్రమాణములతో సమర్థింపఁబడినవి. సోమనాథుఁడు సోమనాథభాష్యములో నిట్టివిషయములను సంస్కృతభాషలో వివరించియున్నాఁడు. అట్టివి మఱికొన్ని యిందుఁ దెలుఁగులో సీసపద్యములలోఁ జెప్పఁబడినవి. ఈ సీసపద్యము లన్నియుఁ దేటగీతులతో నాటవెలఁదులతో, బసవలింగ! అను మకుటముగల యెత్తుగీతులతో వెలయుచున్నవి.

ఇందులో మొదట బసవశబ్దవ్యుత్పత్తి (వృషభ, పశుపశబ్దములనుండి పుట్టినదని) నిరూపితమైనది. తరువాత బసవనామోచ్ఛారణమహిమ, శివాధిక్యము; విభూతిరుద్రాక్షలింగధారణమాహాత్మ్యము, ప్రకృతిపురుషనామములు, విష్ణుభక్తులు శివభక్తు లగుటకుఁ గారణము, చరలింగస్తుతి, శీలలక్షణము, శివానుభవము మున్నగు వీరశైవమతవిషయములు విపులముగాఁ దెలుపఁబడినవి.

ఈగ్రంథమువలన సోమనాథుని వేదవేదాంగపరిజ్ఞాన మెంతయేని ప్రస్ఫుట మగుచున్నది. మఱియు నన్నయభట్టు భారతములో

సీ.

ధర్మతత్త్వజ్ఞులు ధర్మశాస్త్రం బని
                      యధ్యాత్మవిదులు వేదాంత మనియు