పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/444

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శుద్ధాంధ్రనిరోష్య్టనిర్వచన నైషధము

<poem>గీ.అనుచునెచ్చెలు లెల్లమనరుగుదెంచి కలిగియునికీట్లు తద్దయునళుకుతోడఁ గనినదంతయుఁదవతోడఁగనులనీరు గాఱనెఱిఁగించి చనఁగ్రధకై శికుండు.

శా.హాతల్లీయని లోఁగలంగి తుపకాయాయూళ్ళ యందెల్లరుం జేతుల్ జోడుగఁజేర్చి యెన్నఁగఁగడుం జెన్నారురాహత్తులం గూతుంగై కొనునట్టి యాసలెడలం గొండంతగాఁజేసి తా నేతేరంగనొనర్చె ఱేనిఁజెలితానే కోరునన్ సాకునన్.

క.ఎచ్చటఁజూచిననేనుఁగు లెచ్చటఁగనుగొన్న దేరులెచ్చటఁగన్నం జిచ్చునకోడనికాలరు లిచ్చటకేగినను దేజులెల్లడనూరన్

క.నేలయదరంగరిక్కలు రాలఁగనలుఁడేగుదెంచెగ్రక్కుననటకున్ నాలుగుతెఱఁగులదండులు గ్రాలఁగనెదలోననాతిఁగైకొనునిచ్చన్.

క.ఆరయుఁగనేలయుంతయుఁ గోరికాతోఁదిరిగితిరిగిగొనకొనియచ్చో నారదుఁడునునింకొకజడ దారియుజేజేలయూరుదఱియఁగఁజనుడున్.

క. కనుఁకొనియంతయునెదురుగఁ జనికాళులకెఱఁగిగద్దెఁజయ్యననిడినే లనుగలకతలెల్లనడిగి యనియెంజేజేలఱేఁడునాజోగులతోన్.