దివ్యదేశ వైభవ ప్రకాశికా/తిరుక్కుళందై

వికీసోర్స్ నుండి

56. తిరుక్కుళందై 16 (తెన్‌కుళన్దై)

(పెరుంకొళమ్‌)

శ్లో. శ్రీమత్కుళంద నగరేతు పెరుంకొళాఖ్య
   తీర్థే కుళంద లతికా నయనాబ్జ భృజ్గ:|
   ప్రాగాసన స్థితి రసౌ గురుసేవితాంగ
   శ్రీమత్పరాజ్కుశ మునీంద్ర పరిస్తుతాత్మా||

శ్లో. ఆనంద నిలయాఖ్యాస విమానస్థో మహీయతే|
   మాయానట విభుర్భక్త పరిరక్షణ దీక్షిత:||

వివ: మాయక్కూత్తన్-కుళందవల్లి తాయార్-పెరుంకుళ తీర్థం-ఆనందనిలయ విమానము-తూర్పు ముఖము-నిలుచున్నసేవ-బృహస్పతికి ప్రత్యక్షము-నమ్మాళ్వార్ కీర్తించినది.

విశే: ఇచ్చట పెరుమాళ్ల ప్రక్కగా పెరియ తిరువడి (గరుత్మంతులు) వేంచేసియున్నారు. "అత్యంత ప్రీతితో తనను జేరిన వారి స్త్రీ సహజ ధర్మములను పోగొట్టి తన అద్బుత ఆశ్చర్య చేష్టిత గుణములను ప్రకాశింపజేసిన స్వామి" యని "పల్ వళై యార్ మున్ పరిశழிన్దేన్, అను పాశురమున (తిరువాయి మొழி 8-2-4)నమ్మాళ్వార్ భగవంతుని అద్భుత చేష్టిత గుణమును ప్రకాశింపజేసిరి.

సూచన: ఇచటి అర్చకస్వాములు తొలవిల్లి మజ్గలం క్షేత్రమునకు పోవుదురు. వారుండు సమయమును ముందుగా తెలిసికొని సేవింపవలెను.

మార్గము: ఈక్షేత్రమును పెరుజ్కొళమనియే చెప్పవలెను. తిరుప్పుళిజ్గుడి నుండియు, శ్రీవైకుంఠము నుండియు పోయి సేవింపవచ్చును. ఆక్షేత్రములకు 10 కి.మీ. దూరములో గలదు.

పా. కూడచ్చెన్ఱే నినియెన్ కొడుక్కేన్;కోల్వళై నె--త్తుడక్కు మెల్లామ్‌;
    పాడత్తొழிయ విళై న్డువైగల్;పల్వళై యార్ మున్ పరిశழிన్దేన్,
    మాడక్కొడి మదిళ్ తెన్ కుళన్దై; వణ్ కుడపాల్ నిన్ఱమాయ క్కూత్తన్;
    ఆడల్ పఱవై యుయర్‌త్త వెల్పో; రాழிపలవనై యాదరిత్తే.||
          నమ్మాళ్వార్-తిరువాయిమొழி 8-2-4.


మంచిమాట

ఈ ఆత్మకు సర్వేశ్వరుడు కట్టిన మంగళసూత్రమే తిరుమంత్రము.

"పిళ్లై తిరునరయూర్ అరయర్"

57. తిరుక్కురుంగుడి 17

శ్లో. శ్రీక్షీరాబ్ది తరజ్గిణీ తటతలే పూర్ణాహ్వయ శ్రీ పతి:|
    దివ్యే భాతి తిరుక్కురుజ్గుడి పురే పంచాకృతి ద్యోతిత:|
    సంప్రాప్త శ్శుభ పంచకేతిక పదం వైమాన మైంద్రీముఖ
    స్థాయీ సాక్షి పదం కురుజ్గుడి లతానాథ శ్శఠారి స్తుత:||

శ్లో. శ్రీ మద్విష్ణు మన శ్శ్రీమత్పర కాల వచ:ప్రియ:|
   రామానుజార్య మునిపాత్కృతో భయ విభూతిక:

వివ: వైష్ణవ నంబి. మలైమేల్ నంబి; నిన్ఱ నంబి, ఇరుంద నంబి; కిడంద నంబి, తిరుప్పార్‌కడల్ నంబి అను పంచాకృతులలో వేంచేసియున్నారు. కురుంగుడి వల్లి తాయార్; తిరుప్పార్ కడల్ నది; పంచకేతక విమానము; తూర్పు ముఖము, నిలుచున్న సేవ, పరమ శివునకు ప్రత్యక్షము, నమ్మాళ్వార్, పెరియాళ్వార్, తిరుమழிశై ఆళ్వార్, తిరుమంగై యాళ్వార్ కీర్తించినది. ఉడయవరులకు ఉభయ విభూతి నాయకత్వమును అనుగ్రహించిన స్థలము.

విశే: ఈ క్షేత్రమునకు వైష్ణవ వామనమని పేరు. ఇచట స్వామి వడుగ నంబి రూపముతో ఉడయవరులను (శ్రీరామానుజులను) ఆశ్రయించి వారి నుండి మంత్రోపదేశమును పొంది సకల వేదాన్తార్థములను గ్రహించి "మేమును శ్రీభగవద్రామానుజులను ఆశ్రయించితిమి; దన్యులమైతి" మని ఆనందముతో ప్రకటించుటచే ఈ క్షేత్రమునకు వైష్ణవ వామనమని పేరు. ఈ ఉత్సవము ప్రతి సంవత్సరము మిధునమాసములో జరుగును. వామనుడు వసించిన చోటగుటచే కురుజ్గుడి యనియు సిద్దాశ్రమమనియు పేరు వచ్చెను. ఉడయవర్ తడివస్త్రములను ఆరబెట్టిన "తిరువట్టప్పారై" ఇచట సేవింపవచ్చును. ఇచట ఉడయవర్ అంజలి ముద్రతో కాక జ్ఞాన ముద్రతో వేంచేసియుందురు. నిన్ఱ-కిడంద నంబుల సన్నిధుల మధ్య శివుని ఆలయము కలదు.

ఈ సన్నిధికి 10 కి.మీ దూరములో కొండమీద మలైమేల్ నంబి సన్నిధి గలదు. ఈ దివ్యదేశమున తాయార్; పెరుమాళ్లతో కలసి వేంచేసియుందురు. మీనం ఉత్తర తీర్థోత్సవము.

ఈ క్షేత్రమును గూర్చి ఆళ్వార్లు "విఱైన్ద శోతి వెళ్లమ్‌ శూழ்న్ద; నీణ్డ పొన్మేని యోడుమ్‌, విఱైన్దెన్నుళ్లే నిన్ఱొழிన్దాన్" "పరిపూర్ణమైన కాన్తి ప్రవాహముచే పరీవృతమై స్పృహణీయమైన దివ్య మంగళ విగ్రహముతో స్వామి నా హృదయమున వేంచేసి యున్నాడు." అనియు "నీలమేనియుమ్ నాన్గు తోళుమ్‌ ఎన్నెంజం నిఱైన్దనవే"