కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు/సత్యరాజా పూర్వదేశ యాత్రలు-ద్వితీయభాగము-నాల్గవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

అని యేకరాశి గతులయిన సూర్యచంద్రులను బృహస్పతి చూడకున్న కాలమున బుట్టినవాడు నిశ్చయముగా జూడజుడన్న బృహజ్జాతక వచనమునకు ప్రత్యక్ష విరుద్ధముగానున్న వారిశాస్ర్తము సత్యము కాదని నాలో నేననుకొని, అతనికి గోపము వచ్చునన్న భయముచేత నతనితో నేతద్విషయమును గూత్చి ఒతస్తావింపక వారిది రాక్షస్ శాస్త్రమగుటచేత నట్లు వ్యత్యస్తముగా నున్నదని నిశ్చయము చేసికొని యప్పటి కూరకుంటిని.

నాల్గవ ప్రకరణము.

వెనుకటి ప్రకరణమునందు జెప్పిన ప్రపంచము నడిచిన నాలుగు దినముల కొకనాటి మధ్యాహ్న స్మయమునందు నా యజమానుడయిన మహాకాయుడుగారు నాయొద్దకువచ్చి, నేడు రాజసభ జరగబోవుచున్నది గనుక జ్యౌతిషవిద్వాంసులు చెప్పు తీర్పులయొక్క రీతిని జూచి యానంద్ంచుటకయి నీకోరిక ప్రకారముగా నిన్నక్కడకు గొనిపోవ వచ్చినానని సెలవిచ్చును. నే నాయనయాజ్ఞను శిరసావహించి తత్క్షణమే యుచిత వస్త్రాదులను ధరించి యరగడియ లోపలనే ప్రయాణమునకు సంసిద్ధుడను కాగ నా యజమానుడు నాయాలయముయొక్క తలుపులు మూయించినన్ను గొనిపోయి తన గుఱ్ఱపుబండిలో తాను గూరుచున్న మెత్త మీద నన్ను తన కుడువైపున గూర్చుండబెట్టుకొనెను. నేనెక్కిన బండి రాక్షసిబండి యనియు, దానికి గట్టబడిన గుఱ్ఱములు రాక్షసి గుఱ్ఱములనియు, నేనిప్పుడు నేఱుగ జెప్పనక్కఱలేదుగదా ! ఆబండి ధవళేశ్వరపు కొండంతయున్నది; దానికి గట్టబడిన గుఱ్ఱములను ఒక్కొక్కటి పదియేనుగు

లంతలేసియుండి నాదృష్టికి నడగొండవలె గానబడినవి. ఉత్సవ విగ్రహములను దేవాలయములలోని యర్చకులు మోసికొని పోవునట్లుగా నా యజమానుని సేవకులు నన్ను తమచేతులతో గొనిపోయి యాళకటమునందు గూరుచుండ బెట్టగా, భయముచేత నిశ్చేష్టుడనయి దేవాలయములోని పీఠముమీద జీవుడు కూర్చున్నట్లుగా భూదేవుడనైన నేనును కదలమెదలక యందలి మెత్తమీద గూరుచున్నను. కొంతసేపటికి తెలివి తెచ్చుకొని నేను ముందు చూచునప్పటికి గుఱ్ఱములుబండి నీడ్చుకొని వాయువేగమున బరుగెత్తుచుండినవి; బండిచక్రముల చప్పుడు మేఘగర్జనవలె చెవులు చిల్లులు వోవునట్లు కర్ణకఠోరముగా వినబడ జొచ్చినది. ఈయవస్థలో గాలిలోబెట్టిన దీపమువలె వెనుకకును ముందునకును బండికుదుపుచేత నూగులాడుచు ప్రాణములు బిగబట్టుకొని మెత్తగా బట్టుకొని యరగంటసేపు గూరుచుండు నప్పటికి సభమందిరము సమీపించి నందున బండి నిలిచినది. అప్పుడు మహాకాయుడుగారు బండి దిగి సభాగృద్వారము వద్దకి నడవగా వెనుకనుండి భృత్యులు తదాజ్ఞానుసారముగా నన్ను గొని వచ్చి యాయన చేతి కందిచ్చిరి. నావంటి యల్పుని దమవంటి ఘనులు మోచుట ధర్మము కాదని నేనాయనతో నా వినయ విధేయతలు తేటపడునట్లుగా మనవిచేసి నన్ను మఱియొకరి చేతికియ్యవలసినదని ప్రాధికాంచినను, ఆయన నాప్రార్ధన నంగీకరింపక నీచసేవకులు సభాభవనము లోనికి బోగూడదను హేతువుచేత గాబోలును నన్ను వ్యయముగానే చేతులతో నెత్తుకొనిపోయి ధర్మాధికారిగారు చూసిన పీఠముమీద దాను గూరుచుండి నన్ను తన ప్రక్కను గూరుచుండబెట్టు కొనెను. మేమక్కడకు బోవునప్పటికే సభాస్తారులందఱును వచ్చి తమ కర్హములయిన పీఠముల మీద నాసీనులయి యుండగా,

సభౌయంతయు వ్యవహారమును జూడవచ్చిన మహాజనులతో నిండిపోయినది. వారిలో ధర్మాధికారియగు ఖరుడు దక్షిణ ముఖముగా నొక్కయున్న తాసనముమీద గూరుచుండి యుండెను. ఆయనకు కుడిప్రక్కను రెండుమూడు బారల దూరములో వరుసగా వేసియున్న పీఠములపయిని పంచామరతరువులవలె జౌతిషవిద్వాసు లయిదుగురు తలలకు శాలువులు చుట్టుకొని చెవులను కుండలము లల్ల లనాడ గంభీరముగా గూరుచుండి యుండిరి. వ్వారి నామములు వరుసగా వృశ్చికరోముడు, సర్పరోముడు, ఖడ్గరోముడు అగ్నిరోముడు, కంటరోముడు అసి తరువాత నేను మాయజ మానునివలన దెలిసికొన్నాను. రోమకసిద్ధాంతము నభ్యసించుట చేతనో మఱియే హేతువుచేతనో కాని యాదేశమునందు సామాన్యముగా జ్యౌతిష సిద్ధాంతులు నామముల చివరను రోమశబ్దము చేర్పబడు చున్నది. ఆ మహావిద్వాంసులకును ధర్మాధికారికిని నడుమగా లేఖ నోద్యోగి యొకడు నిలువబడి యుండెను. అప్పుడు నిలువబడియున్న యా లేఖకునిపే రతికాయుడు. రాజభటులు చేతు లాడించుచు మాటాడుచున్నవారి నూరకుండుడని కేకలు వేయుచుండగా, ధర్మాధికారి తలయెత్తి చూచి లేఖకుని వైపునకు దిరిగి వ్యభిచార వ్యవహారమును విమర్సించుటకు ముందుగా నందలి వాది ప్రతివాదుల నెదుట బెట్టింపుమని యుత్తరవు చేసెను. అతడు రాజభటులను జూచి ప్రహస్తుని వజ్రహస్తుని కైకసిని దీసికొనిరండుని చెప్పెను. వారు వెంటనేపోయి యిద్దఱు ప్రహస్తులను కైకసిని దీసికొనివచ్చి యెదుట నిలిపిరి.

లేఖ-భటులారా ! మీరిద్దఱు ప్రహస్తులను దెచ్చినారేమి ? వీరిలో వజ్రహస్తుడెవరు ? ప్రహస్తుడెవరు ?

భటు-మేము వాదిప్రతివాదులను గొనిపోయి యొకగదిలో బెట్టి యీవల గూరుచుండగా ప్రభువువారు పిలిచెడి లోపల వారిలో.

సత్యరాజా పూర్వదేశయాత్రలు

వజ్రహస్తుడు తన కామరూప ప్రభావముచేత ప్రహస్తుడుగా మాఱిపోయినాడు

ఇట్లేకరూపమును బొందినవారిరువురిలో నెవ్వడు ప్రహస్తుడో యెవ్వడు వజ్రహస్తుడో నిర్ణయించుటకు శక్యముకానందున వారిలో నొకనిని మొదటి ప్రహస్తుడనియు నింకొకనిని రెండవప్రహస్తుడనియు నిజము తెలియువఱకును జెప్పవలసి యున్నది.

ధర్మా-నిష్కారణముగా మాకు శ్రమకలుగజేయక మీలో నిజమైన ప్రహస్తుడెవడో శీఘ్రముగా జెప్పుడు.

మొ-ప్రహ-నేనే విజమయిన ప్రహస్తుడను. ఇతడు మాయప్రహస్తుడు.

రెం-ప్రహ-నేను నిజమయిన ప్రహస్తుడను. ఇతడుమాయ ప్రహస్తుడు.

ధర్మా-మీరబద్ధము లాడగూడదు. మీలో వజ్రహస్తుడెవడు ?

మొ-ప్రహ-అతడు వజ్రహస్తుడు.

రెం-ప్రహ-అతడు వజ్రహస్తుడు.

లేఖ-ఈ వ్యవహారము చక్కగానే యున్నది. సత్యమునుకనుగొని శిక్షించువఱకును వీరిలో నొక్కరును నిజముచెప్పరు. ఈసత్యా సత్యముల నిప్పు డీవిద్వాంసులే నిర్నయము చేయవలెను.

ధర్మా-ఆసంగతి తరువాత చూచుకొందము గాని ముందుగా మీయభియోగమేదో వాది సభవారితో మనవిచేయవలెను.

మొ-ప్రహ-కై కనీయను నీకామిని నాభార్య. నేనింట లేనప్పుడీ వజ్రహస్తుడు నావేషము వేసికొనివచ్చి-

రెం-ప్రహ-చీ ! అబద్ధములాడకు-ప్రహస్తుడవు నీవా?

నేనా ?-ఓ మహాప్రభూ ! న్యాయప్రభువులు నా మొఱ్ఱ యాలకింప

లంకా ద్వీపము

వలెను. కైకనీయను నీ కామిని నా భార్య. నేనింట లేనప్పుడీ ప్రహస్తుండు నా వేషము వేసికొనివచ్చి-

ధర్మా-ఇక వీరివలన స్త్యము బయలబడదు.-ఓ కైకసీ ! వీరిలో నీభర్త యెవ్వడో నీవు చెప్పు.

కైక-(ఇరువుర మొగములవంక జూచి)ఓమహాప్రభూ ! నేను గదిలోనున్నప్పుడు నాభర్తకు కుడివైపున గూరుచున్నాను. అప్పుడు కూరుచున్నట్లు కూర్చుండబెట్టినపక్షమున నా భర్త యెవ్వరో నేను జెప్పగలను. రాజభటులు వారి నిక్కడకు దీసికొనివచ్చినప్పుడు తమతమ స్థానములను వదలి వారిద్దఱును గలసి పోయినారు. ఇప్పుడు నేనెవ్వరివంకజూచిన నతడే నాభర్తగా గనబడుచున్నాడు.
మొ-ప్రహ-ఓప్రాణేశ్వరీ ! అతనివంక జూడక నావంక జూడు. నేను నీకుభర్తనుకానా ? ఓరీ వంచకుడా ? నీవు మాయ చేసినంతమాత్రమున పెండ్లి నాటినుండియు నన్నెఱిగిన నాధర్మపత్ని నిన్ను భర్తయనుకొను ననుకొన్నావురా ? ఓప్రాణేశ్వరీ ! నిజము చెప్పవేమి ?
కైక-మీరే నా ప్రాణవల్ల భులలాగున నున్నారు.
మొ-ప్రహ-ఓప్రాణేశ్వరీ ! యీమోపగాని మాయమాటలను నమ్మి మోసపోకు, నీవిందాక నాకుడుప్రక్కను గూరుచుండలేదా ? యింతలోనే నన్ను గుఱుతుపట్టలేక పోయినావా ? నేనే నీకు నిజమయిన భర్తనగుదునో, కానో నా మొగముచూచి చెప్పు.

కైక-మీరును నా ప్రాణవల్ల భులలాగుననే యున్నారు.

ధర్మా-ఈయంశమీలాగున తేలదు. నీభర్తయెవ్వరో యా మాట యటుండనిచ్చి నేరము జరిగినదో లేదో నిజముచెప్పు.

సత్యరాజా పూర్వదేశయాత్రలు

కైక-నాభర్తనుదప్ప నేను పరపురుషుని కన్నెత్తి చూడలేదు.

ధర్మా-అదికాదు. ఈయభియోగ పత్రికలో జెప్పబడిన కాలమున డొకపురుషుడు శయనగృహమున నీయొద్దనున్నాడా ?

కైక-నా భర్త నాయొద్దనున్నాడు.

మొ-ప్రహ-అప్పుడున్నవాడు నీభర్తగాడు.నీభర్తయొక్క రూపమును ధరించినచ్చిన వజ్రహస్తుడు.

రెం-ప్రహ-ఆమాట వతమపత్యము. ఆ వేషము వేసికొని వచ్చి నీతో నన్నువాడు వంచకుడయిన వజ్రహస్తుడే.

ధర్మా-ఇటువంటి వ్యవహారములలో పెద్దమనుష్యులు సభలకెక్కరాదు.ఎక్కినపక్షమున నుభయుల గౌరవమును బోవుటయేకాక యిల్లాండ్రకుగూడ నపఖ్యాతివచ్చును. ఈవిషయములో వాది ప్రతివాదు లిద్దఱును సఖ్యపడి సమాధాన పడవలెను.

మొ-ప్రహ-ఈ వజ్రహస్తుడు చెప్పినమాట సర్వజనశ్లాఘా పాత్రముగా నున్నది. ఏలినవారు దోషికి క్రూరదండవము విధింపవలెను.

మొ-ప్రహ-ఓరీద్రోహి ! వజ్రహస్తుడవు నీవా ! నేనా ?

రెం-ప్రహ-ఓరీవంచకుడా ! నీవు వజ్రహస్తుడవుగాక మఱియెవ్వడవురా ? నీవు లోకమును వంచింపదలచు కొన్నను శ్రీమహేశ్వరుని పంచముఖములవలె గూరుచున్న యీ పండితపంచకమైనను నీమోసము తెలిసి కోలేదనుకొన్నావురా ? ఓరిపాపాత్ముడా ! ఓరి క్రూర-

ల౦కాద్విపము

ధర్మా౼మీలో మీరు పొట్లడాక యూరకు౦డుఁడు.౼ఓవిద్వదగ్రగణ్యులారా¡మీరే యిప్పుడు శాస్త్రసిద్ధాతానుసారముగాధర్మనిర్నయము చెయవలెను. నిజముచెప్పక యి౦తసెపు మాకు నిష్కారణముగా నాయసము కలుగఁజెసినందునకయి యీసారీయపరాధికి మే మతిఘోరశిక్ష విది౦ఁదలఁచుకొన్నాము.మీరి యిప్పుడు సిద్ధా౦తీకరి౦పవలసిన య౦శములు౼౧.విరిలొ వజ్రహస్థుఁడెవఁడు‘౨.వజ్రహస్థుఁడు నేరము చెసినాఁడా,లెదా‽౩.ఈమె నిజమయిన కైకసి యగునా ¡ కాదా‽౼ముఖ్యముగా నీమూఁడ౦శములను మీర శాస్త్రపదతిని నిర్ధారణము చెయవలెను.

అని ఖరాసురుఁడు సెలవియ్యఁగానె సిద్ధా౦తు లాకాశమువ౦కఁ జుచియు వ్రేళ్ళు మడచియు నేల మీఁద స౦కెలు వేసియు ముకుపుటముల వ్రేళ్ళు చొనిపియు నొ౦డొరలతో గుసగుసలాడియు లెక్కలు వెసి తలపోఁతలకు జొచ్చిరి. ఈ లొపల ధర్మాధికారి పీటము మీదవెనుక కొఱిగి యొక్క కునుకుకునికెను. సభలో నిలచియున్నయుభయవాధుల పక్షులు వారును విధ్వా౦సు లేమిసెలవిత్తురొ యని విననుత్సుకులె వెచియు౦డిరి. చూడవచ్చినర౦దరఱూను వివిదవిషయములు గూర్చియ తమలోఁతము స౦భాషి౦చుకొనుచుండరి.ఈ ప్రకరముగా రెండుగడియులసేపు నడుచునప్పటీకి సిద్ధ్హాంతులలొ నొకరు లేఖకునిఁ బిలిచి తమ అభిప్రాయములను వ్రాయవలిసినదని చెప్పెను. మనదేశ౦నందు వలెనె యాదేశ౦మునందు విధ్వాంసులకు శాస్త్రజ్ఞానమె కాని యక్షరజ్ఞాన ముండదు.అందు చెతనె యాదేశమునందు వైయాకరణుఁడు తన చుట్టముల కుత్తరము వ్రాయవలసివచ్చినను లౌకికుల యొద్దకుబోయి వ్రాయించు కోవలిసినవాఁడె కాని స్వయముగా వ్రాసికోనేర్చినవాఁడు కాఁడు. ఆ సంగతి యటుండనిచ్చి కార్యంశము చిత్తగింపుడు. లెఖకుఁడు ధర్మా

                                  సత్యరాజా పుర్వదేశయాత్రలు;;

దికారిని లేపినపిమ్మట జ్యొతిష్కులు తమ సిద్ధాంతములను దెలిపిరి. వారిలో వృశ్చికరోముఁడును కంటకరోముఁడును జ్రహస్థుఁడనిచెప్పిరి.తక్కిన ముగ్గురును మొదటిప్రహస్థు;డే వజ్రహస్థుఁడఁరి. ఇఁక రెండవసార౦శము లో వృశ్చిక రోముఁడును కంటకరోముఁడును వజ్రహసుఁడును నేరముచేసినాఁడనిరి. అగ్ని రోముఁడును, సర్పరోముఁడును వజ్రహస్థుఁడు నేరము చేయలెదనియు నతనియందలి ద్వేషము చేత భార్య భత౯ లేకమయి యీదోషారోపణము చేసినారనియు పలికిరి. మూడవ సారంశమును గూర్చి యేవురు సిద్ధాంతములు నైకకంట్యముతో నామె నిజమయినకైకసి యనియే సిద్ధాంతముచేసిరి. అప్పుడు వాదిబంధువు లగ్నిరోమ సర్పరోములు వజ్రహస్థునివలన లంచముగొనిరని కేకలు వేయజోచ్చిరి; ప్రతిబంధువులు వృశ్చికరోమాదులు ప్రహస్థునివలన లంచములు గైకొనిరని కేకలు వేయ నారంభిచిరి. ధర్మాదికారి వారికలకలములువారించి సిద్ధాంతములలో నదిక సంఖ్యగలవారి యభిప్రాయను సారముగా వజ్రహస్థునికి రెండుసంవత్సరములు గృహవాసశిక్ష విదించినట్లు తీర్పువ్రాసి వినిపించెను. సిద్ధాంతుల యభిప్రాయము ననుసరించి తనకు శిక్షయగునని మొదటిప్రహస్థుఁడు వడవడ వడఁకుచు భూమిమీఁదఁబడి మూర్చపోయెను.అందఱును మూఁగిచన్నిళ్ళూ చల్లి యాతనిని మూర్చతేర్చునప్పుటి కా సందడిలో రెండోవ ప్రహస్థుఁడు కనఁబడక యదృశ్యుడయెను.అప్పుడా యంతాధా౯నము నొందివాఁడే నిజమయిన వజ్రహస్థుఁడని యెల్లవారికిని భోధపడెను. ధర్మాధికారి రాజభటులులను జూచి యీఁగయయి యతఁ డెగిరిపోయి యుండేను.పట్టుకొండెని రాజభటులు కాజౢపించెను. వారునానాముఖములు సరచుచు పరుగెత్తిరికాని వారికంటి కెవ్వరును నక్షత్రమండలము లోపలఁ గాన బడలేదు. ఈప్రకారముగా మొదటి వ్యవహరము

<poem>లంకా ద్వీపము

తీర్పఁబడిన తరువాత దొంగతనపు వ్వవహరము తీర్చుటకయి నేరము మోపినవానిని మోపఁబడినవానిని పిలిపింపుమని మరల ధర్మాధికారి లేఖకుని కుత్తరువు చేసెను. అంతట లేఖకుని యొక్క యాజ్ఞాప్రకారముగా రాజభటులు దూషణని ధూమ్రాకుని గొనివచ్చి ధర్మాధికారి యెదటనెలువఁబెట్టిరి.

ధర్మా౼ఓదూణా;నీవు తేచ్చిన యబియోగమేమి దూష౼ఈదూమక్షుఁడు మాబందువుగ౯ములోనివాడు. దుస్సహావాసము చేత నితఁడు చిన్ననాఁటినుండియు దుష్టనర్తనుఁడయి జూదములాడుచు పూర్వు లార్జించిన ధనవంతను పాడుచేసి విచ్చిలవిడిగాఁ దిరుగుచున్నాడు.ఇతఁడు తనతల్లిదండ్రులు విధ్యుక్తముగా వివాహము చేసిన భార్యను విడనాడి జారవృత్తి నవలఁబించి యొకవెశ్య నుంచుకొని యున్నాడు. విత్తము లేనిదే వేశ్యచిత్తమునులోఁగోనుట యొప్పుడును సంభవింప నేరదు గనుక, విత్తహీనుడుయినప్పుడు జారత్వమును చోరత్వ మనుసరించి యుండక మానదు. ఇతఁడు కొంతకాలము క్రిందట మాయింటికి చుట్టపుఁ జూపుగావచ్చి చావడిలో నాడుకొనుచున్న మాచిన్నదానినగయొకటి త్రెంపుకొనిపోయి వేశ్యకిచ్చినవాడు. రక్తస్పర్శ గలవాఁడగుటచేత మేమప్పుడితనిని రచ్చకీడ్వక చీవాటు పెట్టిక్షమించి యూరకున్నాము.నిన్నటి దినము మాఇంటికి మరల వచ్చి నాభార్యనగలపెట్టె యెత్తుకొనిపారిపోయినాడు. పిల్లది చూచి యరవగానే మేము వెంటబడితిమిగాని యితడు వీధిబడి యేదో సందులోదూకి యదృశ్యుడయినాడు.

ధర్మా:-- తరువార నగలపెట్టె దొరికినదా? దూవ:--దొరకలేదు. నేను వెంటనే రాజభటులను గొని సత్యరాజాపూర్వదేశియాత్రలు

యితనియింటికిఁబోయినాను.అప్పుడితఁడింటలేఁడు.ఇల్లుశోధించినాముగానిపెట్టెదొరకలేదు.

ధర్మా-ఇతఁడింటికేరానప్పుడుపెట్టెయెట్లుదొరుకును?మీరుమొట్టమొదటవేశ్యయింటికిఁబోవలసినది.
దూష-ఆపనియుఁజేసినాము.పెట్టెకానియితడుకానియింటదొరకకపోవగామేమెక్కడనుండితిన్నగావేశ్యయింటికిఁబోయిదానియిల్లుశోధింపఁగానొకమూలగదిలోనితఁడుదొరెకెనుగానిపెట్టెమాత్రముదొరకలేదు.రాజభటులీతనినిపట్టుకొనిదేవరసన్నిధికిఁదెచ్చినారు.ఇతడునగలపెట్టెనుచంకక్రిందఁబెట్టుకొనిపరుగెత్తుచుండఁగామేమందఱమునుగన్నులారాఁజూచినాము.

ధర్మా- ధూమాక్షా!నీవేమిచెప్పుకొనెదవు?నీవురాజబంధుఁడవయ్యునునీదుష్పవత౯నముచేతబంధులమయినమాకందఱికినితలవంపులుతెచ్చుకొన్నావు.

ధూమా-నావెనుకటినడతనుబట్టినేనేమిచెప్పిననునామాటయెవ్వరునునమ్మరు.మొదటచిన్నదానినగయెత్తుకొనిపోయినమాటవాస్తవమేకానియీసారిమాత్రమునగలపెట్టనునేనుదొంగిలింపలేదు.నగలపెట్టెపోయినదన్నసమయముననేనువేశ్యయింటనేయున్నాను.

ధర్మా-జారచోరులమాటనమ్మరాదు.ఓవిద్వచ్చిఖాణులారా!నగలపెట్టెపోయినదోలేదో,మీరేశాస్త్రదృష్టిచేతఁజూచిసత్యముచెప్పుడు.

న్యాయస్థానమునకు వచ్చిన ప్రత్యభియోగమునందును మూడు సారాంశముల నేర్పఱుచుట యచ్చటి శాస్త్రమర్యాద.ధర్మాధికారి యీప్రకారముగా సారాంశముల నేర్పఱిచివ్యవహారనిణ౯య లంకాద్వీపము

ము చేఁ గోరఁగా వెనుకఁ చెప్పినప్రకారముగానే సిద్ధాంతులు యధా విధిగా చేయవలసిన తంతునంతను నడపి యాలోచించి యీసారి యభి ప్ర్రాయభేదము లేకుండ పారాంశముల మూఁటిని శాస్త్ర దృష్టితో సావధానముగాఁజూచి యేకవాక్యముగా సిద్దాంతీకరించి సత్యమును తేల్చిరి. ధూమ్రాక్షఁడేయనియు, ఇతఁడాపెట్టెను తానుంచుకొన్న వేశ్యకీయ్యగా నావేశ్యయాపెట్టెను తానుణ్చుకొన్నవిలపురుషుని చేతి కిచ్చియిల్లు దాటించె ననియు, వారేర్పఱచిన నిష్కృష్టాశయమును లేఖఁకుడు వ్రాసి ధర్మాధికారి చేతికిచ్చెను. అదిచూచుకొని ధర్మాధికారి యా కాశమువంకఁజూచి కొంతనే పాలోచించి, రాజబంధుని నిఅచతస్కరునివలె చెఱపాలకుఁ సత్యరాజా పూర్వదేశయాత్రలు

యు జ్యోతిష్కుల సిద్ధాంతనిర్ణయమును గూర్చియుమాటాడ నారంభించిరితిని. నాయజమానుఁడు కొంతసేపు తానావిషయమయి నాతో మాటాడుట కిష్టములేని వానివలెఁ గనబడినను నేను విడిచిపెట్టక వేసిన ప్రశ్ననే మరలవేయుచు వచ్చుటచేత తుదకిష్టములేకయే నాప్రశ్నలకుత్తరము చెప్పవలసినవాఁడయిననందున మాయిరువురకు నీక్రిందిరీతి సంభాషణము జరిగినది-.

సత్య- ఓమహప్రభూ! ఈజ్యోతిష్కుల వ్యవహరనిర్ణయ మెల్లప్పుడు నీప్రకారముగానే యుండునా? వేఱువిధముగా నుండునా?

మహ- ఎప్పుడు నిదేప్రకారముగా నుండును.

సత్య- ఏకశాస్త్రమువలననే సిద్ధాంతనిర్ణయము చేయవలసినప్పుడు వీరిలోవీరికభిప్రాయభేధము లేలకకుగును?
 మహా- శాస్త్రమొక్కటికాదు; శాస్త్రములనంతము.
  సత్య- శాస్త్రము లనంతములయినను,అన్నియునే కవిధముగా ఫలము జెప్పకపొయిన పక్షమున వానిలో కొన్ని యసత్యములు కావలసివచ్చును.

మహా- శాస్త్రము లసత్యము లెన్నిటికి8నిగావు. ఈభేధమునకుఁగారణము శాస్త్రార్ధముచేయువారి బుద్ధివిశేషములో నుండును. ఫలములను జెప్పువారు తమతమ బుద్ధ్యనుసారముగా నూహించి చెప్పుత వలన నిట్టి భిన్నాభిప్రాయములుకలుగుచుండును.

సత్య- నియమము లేక యెవరిబుద్ధికి తోఁచినట్టు వారర్ధము చేయుచువచ్చినచో శాస్త్రములవలన ప్రయోజమేమి?

మహా- శాస్త్రము లెవరిబుద్ధికి తోఁచినట్లు వారి కర్ధమిచ్చునవికావు. అవి యందరికి నేకార్ధమునే యిచ్చును. అయినను శాస్త్రార్ధ నిర్ణయముచేయువారు ముహూర్తము తిన్నగా కట్టలేక పోవుటవలనను గణప తిన్నగా చేయలేక పోవుటవలనను ఫలములోఁ గొన్ని వ్యత్యాసములు కలుగుచుండును.

లంకా ద్వీపము

సత్య- జనుల ధనప్రాణములతో సంబంధించిన వ్యవహరములో సత్య నిర్ణయముచేయుట కేగ్పఱుపఁబడిన పండితోత్తములనైనను చక్కగా కాలము కట్టంగలవారిని, సరిగా లెక్కవేయఁగలవారిని చారించి యేర్పఱుకకా?

మహా- పండితోద్యోగమునకు దేశములోఁ గల జ్యొతిష్యవిద్వాంసులలో శ్రేష్ఠతములనే యేరి యేర్పఱుతురుగాని యిది గుప్తశాస్త్రమగుటచేత నెవ్వరు గట్టివారో యెవ్వరు కారో యేర్పఱుచుల యసాధ్యము. ఇటువంటి శాస్త్రములు రహస్యముగా నుంచఁబడినంత కాలమే తమ మహిమలను గోల్పోయి పాటితప్పిపోవురు. కాఁబట్టి శాస్త్రమన్నది యెవరికిని దెలియకుండ సదా గోప్యముగా నుండవలెను.

సత్య- తమరు సెలవిచ్చినది కొంతవఱకు సత్యమేకాని--

మహా- కాని యని నీవేమో సంశయపడుచున్నావేమి? నేను చెప్పినది సత్యమగునా?కాదా?

సత్య-- తమరు సెలవిచ్చినది నిస్సందేహముగా సత్యము. అండసత్యమణుమాత్రమునులేదు. నాకు వేదవాక్యముంకంటెను తమ వాక్యమునం దెక్కువ గౌరవము. సూర్య చంద్రులు గతులుతప్పినను తమ నోటినుండి యసత్యవాక్కు బయలువెడలునా? శాస్త్రమర్మము లెప్పుడును సర్వజనులకును వెల్లడిచేయాఁగూడదు. అందుచేతినే మాదేశము నందుగూడ చదువెఱుఁగనివారు సహితము జ్యోతిశ్శాస్త్రములోను. వైద్యశాస్త్రములోను, మంత్రశాస్త్రములోను, మహవిద్వాంసులయి జనసమ్మానముపొంది కోటీశ్వరు లగుచున్నారు.

మహా-- ఈసంభాషణమును బట్టి నీవు రహస్యోపదేశమునకు పాత్రుఁడవయినట్టు నాబుద్ధికి పొడకట్టినది కాఁబట్టి నేనిప్పుడు
మర్మము

సత్యరాజా పూర్వదేశయాత్రలు

విడిచి సిద్ధాంతులు చెప్పు ఫలములలో వ్యత్యాసము కలుగుటకుఁగల నిజమయిన కారణము తెలిపెదను. నీవిధి విశ్వాసహీనులతోఁ జెప్పక మహా రహస్యముగా నుంచవలెను. ఇట్టి ఙానదానమున కెల్ల వారును నర్హులుకారు సుమా!

సత్య-- తమరు సెలవిచ్చినది పరమసత్యము. ఙానోపదేశమునకందఱును యోగ్యులుకారు. నేను యోగ్యుఁడనని తమచిత్తమునకు తోఁచిన పక్షమున--
 
   
మహ-- నీయోగ్యతావిషయమై మాకణుమాత్రమును సదేహములేదు. జ్యొతిషము తప్పిపొవుటకు నిజమైన కారణము పరమేశ్వరశాపము. నీవు భక్తగ్రేసరుఁడగుటచేత పరమరహస్యమైనను దాచక నీకిది నేను సమర్మకముగా నుపదేశించినాను. నీవిది భక్తిహీనులకెప్పుడును చెవిని వేయఁగూడదు. ఇప్పుడు నీకు తృప్తికలిగినదా?

సత్య-- నిజమైనకారణమును గ్రహించుటచేత నే నిప్పుడు పరమసంతుష్ణాంతరంగుడ నయినాను. ఇది యత్యంతగుహ్యమైన పరమ రహస్య మనుటకు సందేహములేదు. ఇది దేవరహస్యమే కాకపోయిన పక్షమున, పురాణములనురచించిన మాదేములోని సర్వఙలయిన మహర్హులకొక్కరికైన దెలిసియుండకపోవునా? నేను మాదేశము చేరిన తోడనే దీనిని పద్మపురానముయొక్క యుత్తరభాగమములోని యష్టోత్తర శతసహస్రాధ్యాయమునందుఁ జేర్చి వ్యాసప్రోక్తము చేయించెదను. తమరీ శాపకారణము నామూలాగ్రముగా సెలవియ్యవలెను.

మహా-- పూర్వకాలమునందు శ్రీసాంబమూర్తివారు త్రిపుకాసుర సంహారము చేయఁ బూని యుద్ధ సన్నద్ధులయినయున్నప్పుడు ముందుగా శుక్రాచార్యులవారావృత్తాంతమును తమ జ్యోతిశ్శాస్త్రమహిమచేఁ దెలిసికొని శిష్యులకు తెలుపగా, వారు శివుఁడు వచ్చులోపల తమ పురములతో పాతాళలోకము

లంకా ద్వీపము

నకు యాత్రవెడలిరి. తరువాత సస్తసన్నాహములతోను శివుడు వచ్చి త్రిపురములను గానుక తనదివ్యదృష్టిచేత సిది యంతము శుక్రాచార్యుల కృత్యమని తెలిసికొని జ్యోతిషమెల్లప్పుడును యధాథా౯ము కాకపోవును గాకయని శపించెను. దీనిమర్మమిది.
 సత్య-- నేను ధన్యుఁడనయినాను. తమరు మర్మము విడిచి యీ రహస్యము నాకానతిచ్చినందున, సెలవయినపక్ష్మున నాకు తెలిసిన రహస్యమును నొకదానిని దేవర వారితో మనవిచేసేదను. జ్యోతిషమునకు పార్వతీశాపమున్న మాట మీపురాణ్ములయం వెచ్చటనైనఁ జూచియున్నారా?

మహా-- లేదు. జ్యోతిశ్శస్త్రమున కొక్క యీశ్వర శాపమే గాక పార్వతీ శాపము కూడ నున్నదా? ఏమి ఈ వింత:

సత్య-- లేదు. జ్యోతిశ్శాస్త్రము సందిగ్ధస్థలముల నిచ్చుటకు ముఖ్య కారణము పార్వతీశాపమే. పూర్వము సాంబశివులవారుం సభలోఁగూరుచుండి జ్యోతిశ్శాస్త్రముయొక్క సత్యమును పరిక్షించ వలెననియెంచి బృహస్పతిని జూచి యిప్పుడు పార్వతీదేవి యేమి చేయుచున్నదో చెప్పుమని యడిగెను. ఆతడు శాస్త్రదృష్టిచేతఁ జూచి బార్వతిదేవి వస్త్రహీనమై యభ్యంఙన స్నానము చేయుచున్నదని చెప్పెను. ఆవాక్యము యొక్క యధాధ౯తను కన్నులార చూడవలెనని శివుడుతక్షణమే కొలువు విడిచి లేచి తిన్నగా నంతఃపురమునకుఁబోయి నలుగుపిడితోఁజేసి ప్రాణప్రతిష్ఠ చేసి కావలియుంచిన విఘ్నేశ్వరుఁడు లోపలికి పోనీకపోఁగా నతని శిరస్సు ఖండించి పోయి చూచి జ్యోతిశ్శాస్త్రముయోక్క సత్యమున కత్యాశ్చర్యపడెను. జ్యోతిశ్శాస్త్రమువలన స్త్రీలగుట్టు మగవారీకి తెలిసిపోవుచున్నదిగదా యని పార్వతీదేవి యాగ్రహముతో జ్యోతిశ్శాస్త్రము ఫలింపక పోవును గాక యని ఘోరశాపమిచ్చెను. జ్యోతిష్కులు చెప్పిన ఫలము తప్పిపోవుట కీశాపములే కారణములుగాని శాస్త్రమెంత మాత్రము నబ్ధముకాదు

మహా-- దేవతలందఱును మదుర్మాగులు. అందులోను దేవగురువైన బృహస్పతి పరమదుర్మాగుడు. కాకపోయినపక్షము నమూల్యమైన జ్యోతిశ్శాస్త్రమునకు నిష్కారణముగా శాపము తెచ్చి పెట్టునా? ఇటువంటి దుష్కార్యమును జేసినందుకు మారావణమహారాజు గారు లేకపోఁబట్టి బ్రతికిపోయినాఁడు. పాపి చిరాయు వనుట చేత నెల్ల కాలము నాతనినే బ్రతుకనిమ్ము. సత్యమిప్పుడు నాకు పూణ౯ముగా భోధిపడినది. జగత్తునకు తల్లిదండ్రులయిన పార్వతీ పరమేస్వరులిద్దరు శాపములు పెట్టిన తరువాత సిద్ధాంతులు చెప్పినఫలము తప్పిపోవుటలో నాశ్చర్య మేమున్నది? సిద్ధాంతులు లంచములు పుచ్చుకొని తప్పుఫలములను చెప్పుదురందురుగాని చెప్పినఫలములు తప్పిపోవుటకు లంచము లక్కఱలేక యీశాపములే చాలును.

ఇంతవరకు సంభాషణ జరుగునప్పటికి నాపూజాసమయమును భక్తులు దర్శింపవచ్చు సమయమును సమీపించినందున నాయర్చకులురాఁగా మహాకాయుఁడుగారు నన్ను విడిచి లోపలికిఁ బోయిరి. అంతట నేనీవరకు వణి౯ంచినప్రకారముగా నానిత్యకృతుత్యము యధావిధిగా జరుగ నారంభించెను.

                             --------------------------------

అయిదవ ప్రకరణము.

సభాసందర్శనము చేసి వచ్చిన తరువాత మూఁడవనాఁడు మధ్యాహ్నము మూఁడు గంటలవేళ మహాకాయుఁడు గారు వచ్చి, నేఁడు జ్యోతిశ్శాస్త్రమును గూర్చి సభ జరుగఁబోవుచున్నది గనుక తనవెంటఁజూడ రమ్మని నన్ను పిలిచిరి. మొన్నబండిలో తగిలిన కుదుపువలన గలిగిన నొప్పులింకను తిన్నగా పోకపోయినను, ఆయన మాటకు మాఱు