486
హరివంశము
న్నుం డై ప్రపన్నవత్సలుం డగుసరోజసంభవుండు సకలసురసంఘంబులు గొలువ
హంసయుక్తవిమానంబుతో నేతెంచి యాతని కోరిన వరంబు లిచ్చి సర్వభూత
దుర్జయుం జేసిన.212
తే. తలఁకి వేల్పులు విశ్వవిధాతపాలి, కరిగి యెంతయు దూఱిన నతఁడు వారి
కసుర యెయ్యది యడిగిన నొసఁగవలయు, తీవ్రతపము మహత్త్వంబు తెలియఁజెప్పి.213
వ. అవ్విరోధికి నవసానంబు నిట్టిది యని నిర్ణయించిన నిలింపులు కాలాంతరం బపే
క్షించి యుండిరి దితినందనుం డదితినందనుల నందఱం దొడరి క్రమంబున భంగ
పఱిచి మెఱసిన సత్త్వంబున సత్వపరిచితు లగుమునుల నవమానించి లోకంబులఁ
దాన కైకొని బహుకాలం బేలుచుండఁ బదచ్యుతు లై శరణంబు సొచ్చి యమర
వరులు దమ పడినపాట్లు విన్నవించిన నభయం బిచ్చి యద్దేవుండు వారి
వీడ్కొలిపి.214
నారాయణుఁడు దేవతాప్రార్థితుం డై నరసింహరూపంబున నావిర్భవించుట
ఉ. వేవురు చంద్రు లోలిఁ బదివేవురు సూర్యులు లక్షపావకుల్
ప్రోవయి యున్నయట్టి దగుభూరితరం బగుతేజ మీయజాం
డావలి కెల్ల దుష్ప్రసహమై యెసఁగంగ నృసింహభావసం
భావితమూర్తి గైకొని విపక్షపరిక్షపణక్షణోద్ధతిన్.215
వ. ఆక్షణంబ దైత్యేంద్రుపురంబున కరిగె నాకర్ణింపుము.216
క. దితిసూనుని యైశ్వర్యం, బతిలోక మపేతశోక మాశ్చర్య మత
ర్కితసంపద్భరధుర్యం, బతిరమ్య మగమ్య మీశ్వరాదులకైనన్.217
వ. ఒక్క సభాభవనంబు శతయోజనవిస్తారంబును సార్ధయోజనదీర్ఘంబును బంచ
యోజనోన్నతియుఁ గలిగి కామగామియు సర్వకామికవస్తుభరితంబు నై మణి
కనకనిర్మితస్తంభభిత్తికనకవలభిఘనకవాటాదులను సకలకాలకుసుమఫలోల్లసిత
పాదపప్రకరంబులను బద్మోత్పలాకీర్ణపూర్ణసరసీస్తోమంబుల నభిరామం బగు
చుండు నందుఁ గిష్కుశతోన్నతవిస్తీర్ణం బైన స్వర్ణసింహాసనంబున నాసీనుం డైన
యతని నూర్వశి ఘృతాచి మేనక మొదలయిన యచ్చరలు పదివేవురును విశ్వా
వసుప్రముఖు లగు ననేకగంధర్వులు నాటలఁ బాటల నేప్రొద్దుం గొలుతురు దివి
జులకంటెం దేజంబు మిగిలి సర్వాలంకారకలితులయి విప్రచిత్తి మయుండు శంబ
రుండు రాహువు లోనుగా నఖిలదానవు లుద్యతాయుధహస్తు లై పరివేష్టిం
తురు ప్రహ్లాదుం డాదియగుతనయులు వినయంబునఁ బ్రాంజలు లై యుండుదు
రట్టివిభవంబుతోడఁ గొలు వున్న సమయంబున నారసింహదేవుం డాదేవద్విషు
ముందట నావిర్భవించిన.218
క. తనపాలిమృత్యుదేవత, యునుబోలెను వచ్చి యిట్టు లున్న మహాత్ముం
గని దైత్యుఁడు మది విస్మయ, మును భయమును గౌతుకంబు ముప్పిరిగొనఁగన్.219