కును బరిపాలించి యెఱ్ఱాప్రగ్గడ, శ్రీనాథాది మహాకవిపోషకులై జగద్విఖ్యాతయశస్కులగు రెడ్లరాజ్యము రెండవది. ఈ రెడ్లవంశమున జనించిన దేపటివేముఁడు లేక ప్రోలయవేమారెడ్డి యను నాతఁడు స్వదేశాభిమానమును స్వమతాభిమానమును గలవాఁడగుటచే నాంధ్రదేశమునకుఁ దురుష్కుల వలనఁ గలిగిన బాధలను దొలఁగించి వైదికమతము నుద్ధరింప నెంచినవాఁడై "తనకు నద్దంకి తగురాజధానిగాఁ బరాక్రమంబున బహుభూము లాక్రమించి" రెడ్లరాజ్యమును స్థాపించెను. ఈతఁడు క్రీస్తుశకము 1324వ సంవత్సరము మొదలు 1350 వఱకును రాజ్యపాలనముఁ జేసియుండెనని శాసనముల వలనఁ దెలియుచున్నది. ఈఁతడు మిగుల విద్యాపోషకుండును, ఆర్యమతధర్మములయం దత్యాదరము కలవాడునునై యనేకాగ్రహారదానాదిసత్కార్యముల నొనరించుచు "నన్వయైకపావనుఁడై వెలుఁగొందెను". సకలకళాకోవిదులగు నుభయభాషాకవులచే నిండియుండు నీతని యాస్థానముననే యెఱ్ఱాప్రగడయు నాస్థానకవిగా యుండుటంజేసి యాతనికాలము పదునాలవశతాబ్ది మధ్యభాగంబని మనము నిశ్చయింపవచ్చును.
| "దురితహరు ప్రబంధపరమేశ్వరునిఁ జెద | |
యని విప్రనారాయణచరిత్రమును రచించిన మల్లనకవి చెప్పియుండుటచే ఎఱ్ఱాప్రగ్గడ యింటిపేరు చెదల్వాడవా రని మనకుఁ దెలియవచ్చుచున్నది. ఇతఁ డార్వేలనియో