ఉత్తరభాగము - ఆ. 4.
317
క. ఏవానిగుఱచి చేసేద, రీవిధి యనుటయును వార లింద్రుఁడు యజమా
నావలికిఁ బూజ్యుఁ డాతని, కై వేదంబులు విధించె నఖిలక్రియలన్.51
వ. కావున నస్మదనుష్ఠానంబు తదీయోద్దేశంబునం జెల్లుచున్నది యనినఁ గోపంబు
తోడి యేపున న వ్వెలర్ప నవ్విప్రులం జూచి.52
చ. యముండు గుబేరుఁ డబ్ధిపతి యాదిగఁ గల్గిన దేవకోటితో
నమరవరేణ్యు నూర్జితబలాతిశయంబున భగ్నుఁ జేసి త
త్సమధికరాజ్యవైభవము సర్వముఁ జేకొని యున్నవాఁడ వి
శ్వమునకు నేన కాక పెఱవాఁ డొడయండు గలండె యెప్పుడున్.53
తే. నన్నుఁ గొలువుఁడు మ్రొక్కుఁడు నాకు నభిమ
తాధ్వరంబులు మత్ప్రీ కై యొనర్పుఁ
డేను గడుమేలు సేయుదు నిట్ల యైన
నొండుతెఱుఁగులపనులు మీ రుడుగుఁ డనిన.54
చ. మును లిది యేటిమాట జగముల్ పరిపాలన సేయఁ గర్త యై
తనరు మహేంద్రుఁ డుండ నిను దానవు దుష్టమనస్కు నల్పు నే
మనయముఁ గొల్చువారమె యనర్హవిధం బిది యన్నఁ గన్నులం
గనలునఁ గెంపుసొం పడరఁగా నసురాధముఁ డాక్షణంబునన్.55
వ. తన బంట్లం బిలిచి యిప్పాణులు క్రొవ్వి వెడయఱపు లఱిచెదరు వీండ్రు దొడం
గిన యిప్పని గాసి సేయుం డనినం గో యని యార్చుచుం బేర్చి.56
సీ. యజ్ఞశాలలు వ్రచ్చి [1]యగ్నికుండంబులు పూడ్చి పశుశ్రేణి మాఁడ్చి విడిచి
హోతలఁ బ్రామి యుద్గాతలఁ బొరిగొని యుపదర్శకుల సదస్యులను మోఁది
యరణులు గాల్చి యూపావలి విఱిచి దర్భలు స్రుక్ప్రువములును బాఱవైచి
చరువులు భక్షించి సర్వాన్నరాసులు వెదచల్లి సోమంబు పదటఁ గలిపి
తే. తాపసస్త్రీలఁ జెఱిచి తత్కన్యకాచ, యంబు జెఱపట్టి యజమాను లైన వారి
జడలు మ్రాఁకులతోఁ గట్టి చదియ నడిచి, యాప్రదేశము దార యై యసురవరులు.57
వ. కొంతదడవు విచ్చలవిడిం ద్రుళ్ళి రిట్లు సేయించి తన్నుం గృతక ర్తవ్యుండుగాఁ
దలంచుచు నిలింపమర్దనుండు ప్రాగ్జ్యోతిషంబున కరిగె నీట వసిష్ఠుండు వాసు
దేవుండు కపిలుండు కశ్యపుండు కణ్వుండు జాబాలి ధూమ్యుండు భరద్వాజుండు
మంకణుండు మొదలుగా ననేకమహామునులు తమక్రియాకలాపంబు విఘ్నంబు
- ↑ యజ్ఞ