ఉత్తరభాగము - ఆ. 3.
305
నిడుదలై యెంతయు బెడఁ గగుబాహులు పొడవైనమూఁపులు వెడఁదయురము
గర మొప్పు సింహచంక్రమణరేఖయు వచోగాంభీర్యమాధుర్యగౌరవములు
తే. దనరు త్రైలోక్యమోహనోదాత్తమూర్తిఁ, బ్రకటపౌరుషోదారవిభ్రాజమాను
నతనిఁ గామించి నానాఁటి కంతరంగ, మెలయురాగంబుకతన నాకులత నొంద.190
వ. అమ్మాయావతి పలుకులం జూపులం దనకోర్కి బయలుపఱచినం బ్రకటవివేక
విద్యావిదుం డగు నయ్యుదాత్తచిత్తుం డత్తెరంగునకు సంశయించి యొక్కనాఁ
డేకాంతంబున నయ్యింతి నుపలక్షించి.191
తే. తల్లి వీవు పుత్రుఁడ నేను దగునె మాతృ, భావ మురివినా నీకుఁ బాపచేష్ట
యిట్లు సూపంగ నక్కటా యేమి చెప్పఁ, గామినీజాతి లోకైకకష్ట గాదె.192
క. నీతలం పెయ్యది యే మని, యీతుచ్ఛపుఁబనికి దొడఁగి తింతయుఁ దెలియ
న్నాతీ చెపుమా యనవుడు, నాతరుణి తదాననార్చితాలోలన యై.193
సీ. అనఘ మీతండ్రి మహానుభావుఁడు యదువంశవర్ధనుఁ డగు వాసుదేవుఁ
డఖిలపురంధ్రీజనాభ్యర్చ్య కల్యాణి తల్లి రుక్మిణి మహోదారతేజు
నినుఁ గన్న పురిటిలోనన శంబరుఁడు దెచ్చి యుదధిలో వైచిన నొకక్రమమున
నిటు చేర్చె దైవ మే నిందాఁకఁ బ్రోచితి నన్యులయం దిట్టి యసమకాంతి
తే. నెసఁగుమూర్తులు వుట్టునే యిట్టిపట్టిఁ, బాసి వగఁ బొక్కుచున్నది పంకజాక్షి
యరుగు మీప్రొద్ద జననిఁ గృతార్థఁ జేయు, మాత్మదర్శనచిత్రోత్సవాగమమున.194
క. నీరూపు చూచి వలచితిఁ, గారుణికాగ్రణివి నన్నుఁ గైకొనుము పరీ
హారంబునకుం గారణ, మీరూపున లేదు నిక్క మిది గుణదుహితా.195
వ. శంబరుని నేను మాయావిమోహితుం జేసి మిథ్యాకళత్రభావంబున కాలంబు
గడపితి నివ్విరోధిని గాలగోచరుంగాఁ జూపు మని తెలిపినం బ్రద్యుమ్నుండు
తద్వచనబోధితుం డై కలుషించి యమ్మహాసుకు నాహవంబునకు నాహ్వానంబు
సేయుటయు.196
ప్రద్యుమ్నుండు శంబరాసురుం జంపి దేవీసమేతముగా ద్వారావతికి వచ్చుట
మ. అలుకం బేర్చి సురారి యాతని నుదగ్రాకారుఁ డై తాఁకినం
గలహం బిద్దఱకుం బ్రగాఢకఠినాక్రాంతిం బ్రవర్తిల్లె నం
దలఘుం డయ్యదురాజసూతి నిజవిద్యా[1]వ్యాప్తి మై సప్తమా
యల నోలిం బ్రసరించి యెన్మిదవుమాయం గూల్చె విద్వేషునిన్.197
వ. ఇట్లు శంబరుం గాలగోచరుం జేసి కుమారుండు మాయావతిం గై కొని మాయా
బలంబున నంతరిక్షంబున దైత్యాంతకుపురంబునకుం జని రాజాంతఃపురంబున నవ
తీర్ణుం డగుటయు.198
- ↑ పూర్తి