ఉత్తరభాగము ఆ. 1
257
తే. శరము లొకలక్షఁ గరవీరపురవిభుండు
యాదవేంద్రునిఁ బొదువంగ నతఁడు డెబ్బ
దెనిమిదింటను నాతని నేసె మగుడ
నేఁబదింటఁ గృష్ణుని నన్నరేశ్వరుండు.159
క. వారుణవాయవ్యంబుల, నారాయణుమీఁదఁ దొడిగె నరపతి శరముల్
ఘోరశిఖివజ్రశరవి, స్ఫారతఁ దద్దీప్తి మాన్పెఁ బద్మేక్షణుఁడున్.160
క. జంబుకుఁ డేయఁగ యమరు, ద్రాంబకములు నిగిడి వడిఁ దదస్త్రములు విచి
త్రంబుగ మాధవుచే నిమి, షంబున శమితంబు లయ్యె జగములు వొగడన్.161
చ. హరి గొనయంబు ద్రుంచుటకు నస్త్రవరంబు సృగాలుఁ డెంతయున్
బరవస మొప్పఁ గైకొనినఁ బ్రాజ్ఞుఁడు శార్ఙ్గధరుండు తద్విధం
బరుదుగ నాత్మలో నెఱిఁగి యాతనివి ల్లొక యర్ధచంద్రని
ష్ఠురవిశిఖంబునం దునిమి సొంపఱ నంగము నొవ్వనేసినన్.162
క. వేఱొక విలుగొని విమతుఁడు, దూఱుఁగ హరిమేన నాటెఁ దొమ్మిది యమ్ముల్
మా ఱెనుబదింటఁ బొదివెం, గాఱియగా మఱియుఁ బఱపె గమిగొనఁ దూపుల్.163
శా. కోపం బుత్కటమై ముకుందుఁడు గుణాఘోషంబు దిఙ్మండలా
క్షేసక్షోభకఠోర మై నిగుడఁగా శీఘ్రాస్త్రపాతంబులం
జాపంబుం దునుమాడె సూ హసనోత్సాహంబునం బేర్చి ధా
త్రీపాలున్ బహుళోజ్జ్వలప్రదరపఙ్క్తిచ్ఛన్నుఁ గావించినన్.164
వ. సారథ్యచతురుండునుం దాన యై కడంగి.165
ఆ. అన్యచాపహస్తుఁ డై యతఁ డొకయమ్ముఁ, గేల [1]నమరఁ బట్టి కేళివోలె
సమరరాగభరము సస్మితవక్త్రంబు, నందు మెఱయ నిట్టు లనియె హరికి.166
సీ. గోమంతగిరియందుఁ గొందఱురాజుల నొడిచితి నని మదం బడరి యిందు
వచ్చితి కరవీరవల్లభుఁ దొడరంగ నల్పులు మూఢాత్ము లానృపాలు
రిదె యొక్కరుండన యేను గయ్యమునకు నమరి నిల్చినవాఁడ నట్ల నీవు
నేకాగ్రయోధివై యొసఁగితి ధర్మయుద్ధం బిది గీర్తివిధాయి మనకు
తే. నొక్క వాసుదేవుఁడ కాక యుర్విమీఁద, నెంద ఱిప్పుడు నిను వధియించి నాదు
పేరు సుస్థిరస్థితి నెందుఁ బెంపు నొంద, నిలుపఁ గలవాఁడ నొక్కింత నిలువు మిచట.167
చ. అన విని దేవకీసుతుఁడు హాసవినిష్ఠురవక్త్రుఁ డై సృగా
లునిదెసఁ జూచి నీమనసులో రణవాంఛ నరేంద్ర యిప్పుడుం
- ↑ నేర్చి