పూర్వభాగము - ఆ. 8.
209
తే. రండు కూడంగఁ వేగఁబొదండు మనమ, నోరథచ్ఛేది గాకుండఁ గోరి యాఁగి
యితనిఁ బోనీక నిలుపుద మింతదలరు, వారిఁ గొనివోవ కెట్లు పోవచ్చుఁ దనకు.181
తే. ఏల వ్రేపల్లె పెద్దవా రిట్లు వెఱ్ఱి, గొనిరి కృష్ణుఁ బోనిచ్చినఁ గ్రూరులైన
రక్కసులులోనుగాఁ జేయు క్రందు నెల్ల, నుడుపఁ దమకు దిక్కైన వాఁ డొరుఁడు గలఁడె.182
చ. అని పలుమాట లాడుచును నప్పుడ చెందినడప్పి నంగముల్
దనుత వహించి భూషణవితానకము ల్పడలంగఁ గ్రొమ్ముడుల్
గనుకని వీడి యుజ్జ్వలశిఖామణు లొల్కఁగ నుత్తరీయముల్
చనుఁగవలం దొలంగి వివశస్థితి నొందుచుఁ దూలియాడఁగన్.183
సీ. వెఱపులు పైకొని వెఱఁగుపాటులు వొంది చెమటలు పెల్లయి చేష్ట లుడిగి
వైవర్ణ్యములు సెంది వడఁకులు దొడరి యశ్రులు మీఱి గద్గదికలు గడంగి
రోమాంచములు వేర్చి వైమనస్యము లూని ప్రేమంబు నెలకొని కామ మలరి
తాపంబు లెసఁగి చింతలు విజృంభించి వంతలు మాఱుకొని విముగ్ధతలు బలసి
తే. తనుకరాక గోవిందునిఁ దగిలి చిక్కు, వడినచూపులు దిగువ నుపాయ మేది
కొఱలి మిన్నక నిలిచిరి గోపకాంత, లందఱును జిత్రరూపులయట్టికరణి.184
వ. అక్రూరుండును నిజరథం బతిత్వరితగతిం జననిచ్చిన నయ్యింతు లంతట భూర
జంబు లోచనగోచరంబగునంతఁదాఁకఁ జూచుచుండి యనంతరంబ యాశాచ్ఛేద
నంబున ఖేదం బొదవఁ గ్రమ్మఱి రట భోజపతి మాధ్యందినకాలంబునం గాళింది
సేరి తత్తీరంబునం గదంబచ్ఛాయాశీతలం బగుసికతాతలంబున నిలిచి.185
శా. ఏ నొక్కించుకసేపు పుణ్యనదిలో నివ్వేళ కర్హంబుగా
స్నానాద్యుక్తవిధానము ల్నడపెద న్నావచ్చునందాఁక మీ
రీనిర్దోషమహీస్థలిన్ రథముపై నింపారఁగా నుండుఁ డ
మ్లానం బైనతృణోత్కరంబు హయముల్ సంప్రీతితో మేయఁగన్.186
వ. అని పలికి సవినయంబుగా సంకర్షణదామోదరుల నునిచి చని యతండు.187
క. సరిబాహ్యాంతరశుచితా, పరుఁడై మును వార్చి తీర్థపరికల్పితవా
గ్విరచనతోడఁ బ్రవాహాం, తరము ప్రవేశించె నాభిదఘ్నజలములన్.188
వ. చిరతరస్నానం బొనర్చుచుఁ (గృష్ణనామోచ్చారణం బొనరించుచుం) గ్రుంకి రసా
తలలోకంబు గని యందు వాసుకికర్కోటకప్రముఖనాగకులసంకీర్ణం బై సౌవర్ణ
రచనాసురుచిరం బగువినూత్ననవరత్నమండపాభ్యంతరంబున.189
శ్రీకృష్ణుఁ డక్రూరునకు యమునాజలంబులలోఁ దనమహానుభావంబు చూపుట