198
హరివంశము
క. పావకునకు నభిమంత్రిత, మై వేల్వఁగఁబడినహవ్య మధికసముద్వే
గావహ మైనట్లు బుధుల, కేసము లగుజడులమాట లెద యెరియించున్.92
వ. నీవు వసుదేవుఁ బుత్రగోపనం బొనర్చె నని నిందించితి బిడ్డలఁ దన యోపిన
ట్లాపదలం బొందకుండం గాచికొనక యూరక చావనిత్తురే మీతల్లిదండ్రులు
ప్రయత్నంబునం బెంపక యింతటివాఁడ వెట్లైతీ పుంనామనరకంబునం బడకుండఁ
ద్రాణంబు సేయుపుత్రుం బోషింపకుండవచ్చునే వసుదేవనిందయు వాసుదేవ
ద్వేషంబును బాటించుట కులంబువారి కెల్లను విషంబు ద్రావనిచ్చుటగా నెఱుం
గుము నీయాడిన కీడుమాటలకు మామనంబు లన్నియుం గలంగె నేము విడిచి
తొలంగిన రాజ వై యుండుటకుం జాలుదు నీయట్టి నీచు ననాచారు నవిచారు
లమై వాత్సల్యంబువలన విడువంజాలక తన్నుకొనుచున్న నరాధములము
మమ్ము నిందించుకొందుము గాక యొం డేమి యందుము రామదామోదరులం
దొడరి బ్రతుకువాఁడ వై తేని నీచేసిన తపం బెవ్వరికిఁ గలదు భవద్వినాశ పిశు
నంబు లగు దుస్స్వప్నంబులు మృగపక్షిచేష్టితంబులు ననేకంబులు సూచెదము
దేవతాప్రతిమలు సలించుటలు నుల్కానిర్ఘాతంబులు పడుటయును సూర్యచంద్ర
మండలంబులు ప్రచండకబంధగ్రసనాదివైకృతంబులం బొందుటలును బాప
గ్రహంబులు క్రూరరాసుల వక్రించుటలు మొదలుగా నెయ్యవి దైవజ్ఞులు రాజ
వ్యపాయంబునకు గణియింతు రట్టినిమిత్తంబు లన్నియుం గలిగి యున్నయవి
మీఁద లెస్స యగుట యత్యంతదుర్లభంబు.93
మ. నిను భూనాథునిఁ గాఁగఁ గొల్చి మనముల్ నిత్యంబు సంతాపమున్
దనుకం గ్రుళ్లుచు నున్న చుట్టములలో ధన్యాత్ముఁ డొక్కండ యెం
దును నక్రూరుఁడు వాసుదేవు జగదాద్యు న్విశ్వవంద్యు న్మహా
మునిహృద్ధ్యేయునిఁ జేరి చూడఁ గని సమ్మోదాఢ్యుఁ డయ్యె న్మదిన్.94
మ. హరి నిం కెన్నఁడు చూతు మె ట్లతనిసౌహార్దంబు చేకూరు నే
వెర వద్దేవుని నాశ్రయింప నతని న్వీక్షించి యాచూడ్కి యే
నెరసుం బొందకయుండ వచ్చి మముఁ దా నెమ్మిన్ మహాభాగ్యసుం
దరుఁ డక్రూరుఁడు చూచుఁగాత దురితధ్వాంతచ్ఛిదాశౌండతన్.95
వ. అది యట్లుండె నింక నొక్కటి గలదు వినియెదవేనిం జెప్పెద.96
శా. గోవిందుం డీట వచ్చినప్డు సకల జోక్షోభంబుగా నీకుఁ బ్రా
ణావచ్ఛేద మొనర్చునట్టిదశ బిట్టై వచ్చుఁ దప్పింపరా
దే వీరుల్ నినుఁ గూడిరేనియును నీ వీలోననే పోయి యా
దేవుం బ్రీతియెలర్పఁ దేర్పుము శుభోత్సేకంబు సంధిల్లఁగన్.97