ఈ పుట ఆమోదించబడ్డది
ప్రథమాశ్వాసము
175
గదమీది మోహముల్ గదలించి కదలు
అన వినీ వనచరాధ్యక్షునిమోము
గనుగొని నడముడి కను లెఱ్ఱచేసి
మర్కటాధమ! యిన్ని మాయలు పన్ని1935
మార్కొని యెంతేని మాటలాడెదవు
ముదికోతివనియున్న, మోసంబువచ్చె[1] '
నిదియెల్ల నీమర్మ మిప్పుడు దెలిసె
పరుషంబు లిట్లాడి బకహిడింబాది
నరభోజనులు గూలివారు నా చేత1940
దనుజుఁడ వేమొ! గంధర్వుఁడ వేమొ.
వనచరాధమ! చావవలదు నా చేత
ఆరసి నీబాము లన్నియుఁ జూచి
యీరూపుతో నిల్చి యిచ్చోటనుండి
యనువొంద మాయన్న యాంజనేయుండు1945
వనధిలంఘించిన వై ఖరిదోఁప
దాఁటిన నొకజంగ దాఁటనా నిన్ను
మీటిన మిన్నంట మీఁద నా వ్రేల
- ↑ ముదికోతి యనియున్న మోసంబు వచ్చె. (ట )