పుట:సకలనీతికథానిధానము.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

43


తురగంబు డిగి నదీతోయంబు జొచ్చుచో
        నొకవిప్రు గాంచి తా నొక్క డగుట
కతన గుఱ్ఱము బట్టు క్షితిసుర యన వాఁడు
        పట్టకున్నను గశఁగొట్టుటయును


తే.

పారుఁ డరుదెంచి యాసువిచారునకును
జెప్పుటయు నాత్మసుతు గొంచు శుద్ధయోగి
విక్రమాదిత్యునకు నది విన్నవించి
సుతుని చెయి ద్రుంచు మన ద్రుంచ నతనిమీఁద.

247


ఆ.

హేమవృష్టి గురియ నాముని కది యీయ
మునియు నిచ్చె విప్రతనయునకును
కపటమునియు వాని కరమున సంధాన
కరణి మోపుటయును గరము మొలచె.

248


వ.

అందున కద్భుతచిత్తులయిన భూసురభూపతులచేత పూజితుండై యాత్మపురంబున కరిగె. మఱియును వినుమని యిట్లనియె.

249


క.

పాతకముల నణగించును
ఖ్యాతులు దిక్కుల ఘటించి కామితఫలముల్
చేతికి లోనగు నరునకు
భూతదయం బోలగలదె పుణ్యము ధరణిన్.

250


వ.

అది యెట్లనిన.

251


సీ.

విక్రమార్కుఁడు భూమి వీక్షింప నరుగుచో
        పథగహనంబున బడియలోన
నడుసున బడి బక్కయావు చిక్కిన దయ
        నెత్తెదనని పోయి యెత్తలేక